BREAKING: భద్రాచలంలో పోలీసులపై మావోయిస్టుల కాల్పులు!

TG: భద్రాచలంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చర్ల మండలం CRPF క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేదని డీజీపీ కామెంట్స్‌ చేసిన 24 గంటల్లోనే దాడికి మావోయిస్టులు తెగబడడం కలకలం రేపింది. ప్రస్తుతం భద్రాచలంలో హైఅలెర్ట్ ప్రకటించారు.

New Update

Bhadrachalam: భద్రాచలంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చర్ల మండలం CRPF క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. బీజీఎల్ లాంచర్లతో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. బుధవారం రాత్రి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. మావోయిస్టుల దాడిని CRPF బలగాలు  తిప్పికొట్టాయి. 20 నిమిషాల పాటు ఎదురుకాల్పులు కొనసాగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేదని డీజీపీ కామెంట్స్‌ చేసిన 24 గంటల్లోనే దాడికి మావోయిస్టులు తెగబడ్డారు. భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో హైఅలెర్ట్ ప్రకటించారు పోలీసులు. ఈ కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య ఇంకా అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం మావోయిస్టుల దాడి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 

RTV Exclusive Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు