Telangana Elections: ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే!

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ సర్వే సంస్థలు ప్రీ పోల్ సర్వే రిపోర్ట్స్‌ను వెల్లడించాయి. మెజార్టీ సంస్థలు బీఆర్‌ఎస్ పార్టీదే అధికారం అని చెబుతున్నారు. కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని కొన్ని సంస్థలు చెబుతున్నారు. అధికారం ఏ పార్టీదో తేలాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.

New Update
Telangana Election Polling: తెలంగాణ పోలింగ్.. ఏ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే..

Telangana Elections Survey Reports: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం కూడా ముగియనుంది. చివరి రోజు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోడ్ షో లతో హడావుడి చేస్తున్నారు. మరొక్క రోజు గడిస్తే.. ఏ పార్టీ భవితవ్యం ఏంటనేది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంటుంది. డిసెంబర్ 3న ఇక తెలంగాణను ఏలేది ఏ పార్టీ అనేది తేలిపోతుంది. ఓటర్లు ఎవరిని దీవిస్తారు? ఎవరికి పట్టం కడతారు? అనే అంశంపై ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజకీయ నేతలు. అయితే, అంతకంటే ముందుగానే.. జనం నాడి ఏంటి? ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఏ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు? అనే అంశాన్ని తేల్చేందుకు అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ప్రజల మూడ్ ఏంటో తెలుసుకున్నాయి. వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో నిర్ధారించాయి. వీటిలో ప్రధానంగా ఏబీపీ-సీఓటర్ సర్వే, డెమోక్రసీ టైమ్స్ నెట్‌వర్క్, జనతా కా మూడ్, సౌత్ ఫస్ట్, సీ నెక్ట్స్ సర్వే, రాజ్‌నీతి, ఆత్మసాక్షి, లోక్‌పోల్, ఇండియాటీవీ-సీఎన్ఎక్స్, మిషన్ చాణక్య సర్వేలన్నీ తమ ప్రీ పోల్ సర్వే రిపోర్ట్‌ను విడుదల చేశాయి. ఈ సర్వేలు తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో లెక్కలతో సమా వివరాలను వెల్లడించాయి. మరి ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

ఆత్మసాక్షి సర్వే..

మొత్తం - 119
బీఆర్ఎస్ పార్టీ - 64-70
కాంగ్రెస్ పార్టీ - 37-43
బీజేపీ - 5-6
ఎంఐఎం - 6-7
ఇతరులు - 1-2
మరో 6 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.

రాజ్‌నీతి సర్వే..

బీఆర్ఎస్ - 75(+/- 6)
కాంగ్రెస్ - 31(+/- 4)
బీజేపీ - 5(+/- 2)
ఎంఐఎం - 7
ఇతరులు - 1

లోక్‌పోల్ సర్వే..

బీఆర్ఎస్ - 36 - 39
కాంగ్రెస్ - 69 - 72
ఏఐఎంఐఎం - 5 - 6
బీజేపీ - 2 - 3
ఇతరులు - 0 - 1

ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ సర్వే..

బీఆర్ఎస్ - 70
కాంగ్రెస్ - 30
బీజేపీ - 7
ఎంఐఎం - 7
ఇతరులు - 1

డెమోక్రసీ టైమ్స్ నెట్‌వర్క్ సర్వే..

మొత్తం - 119
బీఆర్ఎస్ - 45
కాంగ్రెస్ - 42
బీజేపీ 4
ఎంఐఎం - 6
టఫ్ ఫైట్ - 22

జనతా కా మూడ్ సర్వే..

బీఆర్ఎస్ - 72 - 75
కాంగ్రెస్ - 31 - 36
బీజేపీ - 04 - 06
ఎంఐఎం - 06 - 07

సీ నెక్ట్స్ సర్వే..

బీఆర్ఎస్ - 14
కాంగ్రెస్ - 91
బీజేపీ - 5
ఎంఐఎం - 4
బీఎస్పీ - 1
4-5 స్థానాల్లో హోరా హోరీ పోటీ ఉంటుంది.

సౌత్ ఫస్ట్..

బీఆర్ఎస్ - 41 - 46
కాంగ్రెస్ - 57 - 62
బీజేపీ - 3 - 6
ఎంఐఎం - 6 - 7

సీ-ఓటర్ ఒపీనియన్ పోల్..

బీఆర్ఎస్ - 66
కాంగ్రెస్ - 41
బీజేపీ - 5
ఎంఐఎం - 7

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సర్వే సంస్థలు ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నాయి. నియోజకవర్గాల వారీగా శాంపిల్స్ సేకరించి.. ప్రజల మూడ్‌ను వెల్లడించాయి. దాదాపు మెజార్టీ సర్వేలు మూడవ సారి కూడా బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణలో అధికారం చేపడుతుందని అంచనా వేశాయి. రెండు, మూడు సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి. ఏది ఏమైనా.. ఈ సర్వేలే పార్టీ గెలుపోటములకు ప్రామాణికం అని చెప్పలేం. గతంలో సర్వే సంస్థలు ఇచ్చిన అనేక రిపోర్టులు తలకిందులైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓటరు నిర్ణయం ఏంటనేది తెలియాలంటే.. డిసెంబర్ 3వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bhubharathi Portal : రేపే భూభారతి పోర్టల్ ఆరంభం..ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు

రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూభారతి అమలుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

New Update
Bhubharathi Portal

Bhubharathi Portal

Bhubharathi Portal : రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది.రాష్ట్రంలో భూభారతి పోర్టల్‌ను తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.భూభారతి అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి పోర్టల్‌ను రేపు జాతికి అంకితం చేయబోతున్నట్లు తెలిపారు. సామాన్య రైతుకు కూడా అర్ధమయ్యేలా భూభారతిని రూపొందించాలని అధికారులకు సూచించారు. భూభారతి తాత్కాలికం కాదని.. కనీసం వంద సంవత్సరాల పాటు ఉంటుందని అన్నారు. భూభారతి వెబ్‌సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయత సంస్థకు అప్పగించాలని చెప్పారు.కాగా పోర్టల్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు.  

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

భూ స‌మ‌స్యల ప‌రిష్కారం, లావాదేవీల‌కు చెందిన స‌మాచారం రైతులకు, ప్రజలకు సుల‌భంగా అంద‌బాటులో ఉండేలా భూ భార‌తి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూభారతికి చెందిన పలు అంశాలను అధికారులకు ఆయన సూచించారు. ఈ పోర్టల్​ ను పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో మూడు మండలాల్లో పైలట్​ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని అక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా స‌ద‌స్సుల్లో ప్రజ‌ల నుంచి వ‌చ్చే సందేహాలను నివృత్తి చేయాలో అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈ భూ భారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండ‌లంలోనూ క‌లెక్టర్ల ఆధ్వర్యంలో స‌ద‌స్సులు నిర్వహించాల‌ని సీఎం ఆదేశించారు.

Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

 ప్రజలు, రైతుల‌కు అర్ధమ‌య్యేలా, సుల‌భ‌మైన భాష‌లో పోర్టల్ ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్ బ‌లోపేతానికి ప్రజ‌ల నుంచి వ‌చ్చే స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తూ ఎప్పటిక‌ప్పుడు అప్‌డేట్ చేయాలని సీఎం అధికారుల‌కు సూచించారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాల‌ని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ కార్యద‌ర్శి జ్యోతి బుద్ద ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన  

 రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ ప్రజల పాలిట శాపంగా మారిందని, భూ లావాదేవీలన్నింటినీ ఆన్​లైన్​ ద్వారా నిర్వహించేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ సామాన్య ప్రజలకు ఇబ్బందులను తెచ్చిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీ గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం విమర్శలు చేసింది. భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల నుంచి ధరణి పోర్టల్‌లో ఎక్కించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తింది. దీంతో 20 లక్షలకు పైగా రైతులు ధరణి పోర్టల్‌ కారణంగా ఆగమయ్యారని ఆరోపించింది.

Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు

 

Advertisment
Advertisment
Advertisment