Vemireddy: సంచలనంగా వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో.!

నెల్లూరు రాజకీయాల్లో కొవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో సంచలనంగా మారింది. వైసీపీ నేత నల్లపరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ఆడియోలో తెలుస్తోంది. అయితే, తనపై ప్రజాభిమానం చూసి తట్టుకోలేకే వైసీపీ నేతలు ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు ప్రశాంతి.

New Update
Vemireddy: సంచలనంగా వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో.!

TDP Vemireddy Prashanthi Reddy: నెల్లూరు జిల్లా కొవూరులో టీడీపీ, వైసీపీ మధ్య ఫోన్ కాల్ వార్ నడుస్తోంది. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి వైసీపీ నేత నల్లపరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. టీడీపీలో చేరితే మూడు కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also read: అనకాపల్లి దశ మారుస్తామని పవన్ మాటిచ్చారు.. కొణతాల కీలక వ్యాఖ్యలు!

ఆత్మకూరులో టీడీపీ గెలవదని..విక్రమ్‌ బాగా చేస్తున్నాడని ఆడియోలో ఉంది. తనకు టీడీపీలో చేరడం ఇష్టం లేదని తనకు పోటీ చేయడం ఇష్టం లేకున్నా కొవూరులో నిలబెడుతున్నారని అన్నట్లుగా ఉంది. అయితే, ఈ ఆడియోపై ఆమె ఖండించారు. తనపై ప్రజాభిమానం చూసి తట్టుకోలేకే వైసీపీ నేతలు ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు ప్రశాంతి.

Advertisment
Advertisment
తాజా కథనాలు