AP: వైసీపీ మాజీ మంత్రి బాలినేని అక్రమాలపై సుబ్బారావు గుప్తా ఎక్స్‌క్లూజివ్.!

వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి అక్రమాలపై టీడీపీ నేత సుబ్బారావు గుప్తా సాక్ష్యాలతో వివరణ ఇచ్చారు. వెంచర్ కోసం నకిలీ అనుమతి తీసుకుని వే బిల్ ద్వారా కొండను తవ్వించారన్నారు. నల్ల కాలువను సైతం ఆక్రమించారన్నారని మండిపడ్డారు.

New Update
AP: వైసీపీ మాజీ మంత్రి బాలినేని అక్రమాలపై సుబ్బారావు గుప్తా ఎక్స్‌క్లూజివ్.!

YCP Balineni Srinivasa Reddy: వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అక్రమాలపై టీడీపీ నేత సుబ్బారావు గుప్తా (TDP Subbarao Gupta) సాక్ష్యాలతో వివరణ ఇచ్చారు. RTVతో ఆయన ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ..మాజీ మంత్రి బాలినేని, అతని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఎక్కడ? ఎంత? ఎలా? దోచుకున్నారో.. అధికార దుర్వినియోగం ఎలా చేశారో RTVకి వివరించారు.

Also Read: రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నలుగురు ఐపీఎస్‌ల పాత్ర.. మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.!

పూర్తిగా రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం నకిలీ అనుమతి తీసుకున్నారన్నారు. వే బిల్ ద్వారా కొండను తొలిచేసారన్నారు. వరద ఉదృతిని తట్టుకునేందుకు ఏర్పాటు చేసిన నల్ల కాలువను సైతం ఆక్రమించారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నగరపాలక సంస్థ నీటి సరఫరాను, ఇసుకను అక్రమంగా తరలించారని తెలిపారు.

Also Read: చంపేస్తానని బెదిరించాడు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాధితురాలు..

ఇంకా అనేక చోట్ల ఇలా అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని.. వాటి నిగ్గు త్వరలో తేలుస్తానని వెల్లడించారు. జరిగిన అవినీతి, అక్రమాలపై ఉన్నతాధికారులకు, పాలకులకు ఫిర్యాదు చేస్తానని.. న్యాయం కోసం పోరాడుతానని ఉద్ఘాటించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు