బాధితులకు వందకు వందశాతం నష్టపరిహారం చెల్లించాల్సిందే.!

విశాఖ షిప్పింగ్ హార్బర్ ప్రాంతాన్ని పరిశీలించారు టిడిపి నేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ అధీనంలో ఉన్న హార్బర్ కు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు వందకు వందశాతం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు.

New Update
బాధితులకు వందకు వందశాతం నష్టపరిహారం చెల్లించాల్సిందే.!

TDP Leaders: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు టిడిపి నేతలు. దెబ్బతిన్న బోట్ల దుస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి విశాఖ అధ్యక్షులు వల్ల శ్రీనివాస్, కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు , దక్షిణ ఇన్చార్జి గండి బాబ్జి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read: విశాఖ షిప్పింగ్ హార్బర్‌ బాధితులకు అండగా జనసేనాని.!

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..అగ్ని ప్రమాదంలో 36 కోట్లు పైగా నష్టం జరిగింది‌ని తెలిపారు. ప్రభుత్వ అధీనంలో వున్న హార్బర్ కు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు వందకు వందశాతం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ మత్స్య సంస్ధల నుంచి కూడా సహాయం అందించాలని కోరారు. అనంతరం, కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడారు. బోటు పనిచేసే ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోటు కట్టాలంటే 6 నుంచి 7 నెలలు పడుతుందని..ఒక బోటుపై 30 మంది బతుకుతారని..వారందరికీ న్యాయం చేయాలని కోరారు.

Also Read: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ప్రమాదంలో మరో కొత్త కోణం.. నాని ఏం చెప్పాడంటే

ఈ క్రమంలోనే ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు  మాట్లాడుతూ..ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటి సారని తెలిపారు. బోట్ యజమానుల బాధలు తెలుసుకున్నామని చెప్పారు. అయితే, ప్రభుత్వం 80 శాతం నష్టం ఇస్తానంటోందని..కానీ, ఇతర అనుబంధ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. బోట్ లో వున్న సామగ్రికి కూడా లెక్కకట్టాలని జేడి ఫిషరీస్ కు చెప్పామని వెల్లడించారు. శాశ్వతంగా కోలుకునేలా ఎలాంటి షరతులు లేకుండా ఉదారంగా సహాయం చేయాలని అభ్యర్థించారు. వివక్ష లేకుండా విలువకట్టి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు గండి బాబ్జీ. రైల్ ప్రమాదం జరిగినపుడు ఒక లాగా..ఈ ప్రమాదంకు ఒక లాగా నష్టపరిహారం వుండకూడదని అన్నారు. బాధితులకు పూర్తి నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pavan Kalyan Son: పవన్ తనయుడు ఎలా అయిపోయాడో చూశారా?.. ఫొటోలు వైరల్

పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్‌ హెల్త్ అప్డేట్ వచ్చింది. మరో మూడు రోజుల పాటు మార్క్ హాస్పిటల్‌లోనే ఉండనున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. తాజాగా మార్క్ ఫొటో వైరల్‌గా మారింది.

New Update

సింగపూర్ లోని స్కూల్ బిల్డింగ్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతడికి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే అగ్నిప్రమాదంలో వచ్చిన పొగ ఊపిరితిత్తుల దగ్గర పట్టేయడంతో భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

హెల్త్ అప్డేట్

ఇక ఇవాళ ఉదయం మార్క్ శంకర్‌ హెల్త్ కండీషన్ మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు అతడిని అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అయితే ఇప్పుడిప్పుడే మార్క్ శంకర్‌ను డిశ్చార్జ్ చేయమని.. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ఫొటో వైరల్

ఈ నేపథ్యంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు నెబ్లైజర్‌తో ఆక్సీజన్ తీసుకుంటున్న ఫొటో ఒకటి చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా అతడి కుడి చేయికి ఒక కట్టు కూడా వేశారు. అయితే ప్రస్తుతం ఆ ఫొటో చూస్తుంటే మార్క్ శంకర్ హెల్తీగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు మార్క్ శంకర్ రెండు చేతులతో థమ్సప్ సింబల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. 

Also Read: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

(Pawan Kalyan | pawan kalyan son mark shankar | pawan son mark shankar school fire incident | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment