Chinatamaneni : రణరంగంగా దెందులూరు నియోజకవర్గం.. బూతుల వర్షం కురిపించిన చింతమనేని..!

దెందులూరు నియోజకవర్గం రణరంగంగా మారింది. గోపన్నపాలెం గ్రామస్తులతో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. జనంపై బూతుల వర్షం కురిపించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

New Update
Chinatamaneni : రణరంగంగా దెందులూరు నియోజకవర్గం.. బూతుల వర్షం కురిపించిన చింతమనేని..!

TDP Chinatamaneni Prabhakar : ఏలూరు(Eluru) జిల్లా దెందులూరు నియోజకవర్గం రణరంగంగా మారింది. గత అర్ధరాత్రి దెందులూరులో హైడ్రామా కొనసాగింది. అసలేం జరిగిందంటే.. నిన్న గోపన్నపాలెంతో పాటు పలు గ్రామాల్లో టీడీపీ(TDP) అభ్యర్థి చింతమనేని ప్రభాకర్(Chintamaneni Prabhakar) ఎన్నికల ప్రచారం(Election Campaign) నిర్వహించారు. ఈ నేపథ్యంలో గోపన్నపాలెం గ్రామస్తులతో చింతమనేని వాగ్వాదానికి దిగారు. జనంపై చింతమనేని బూతుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.

Also Read: పిఠాపురంలో కోట్ల విలువైన మద్యం సీజ్‌..!

దీంతో, ఓట్లడిగే పద్ధతి ఇదేనా అంటూ జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గొడవకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. చింతమనేని తమపై దాడి చేశారంటూ పలువురు గ్రామస్తులు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, చింతమనేనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామంటున్నారు స్థానిక వైసీపీ నాయకులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు