TDP: ఆఖరి నిమిషంలో అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ

టీడీపీ అభ్యర్థులకు అధిష్టానం ఎల్లుండి బీఫామ్‌లు అందించనుంది. ఈలోపే విభేదాలు, అసంతృప్తులు ఉన్న చోట అభ్యర్థుల్ని మార్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదారు సీట్లలో కొత్త వారికి బీఫామ్‌లు ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

New Update
TDP:  ఆఖరి నిమిషంలో అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ

TDP: టీడీపీ అభ్యర్థులకు అధిష్టానం ఎల్లుండి బీఫామ్‌లు అందించనుంది. ఈలోపే విభేదాలు, అసంతృప్తులు ఉన్న చోట అభ్యర్థుల్ని మార్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదారు సీట్లలో కొత్త వారికి బీఫామ్‌లు ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆఖరి నిమిషంలో అభ్యర్థుల్ని మార్చేస్తోంది.

Also Read: నేడు ముఖేశ్‌ అంబానీ బర్త్ డే.. ఆయన లైఫ్ సీక్రెట్స్ గురించి మీకు తెలుసా!

ఉండి సీటు దాదాపు రఘురామకృష్ణరాజుకు ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ రామరాజుకు సీటిచ్చిన టీడీపీ.. రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అనపర్తి - దెందులూరుల్లోనూ ఇంకా పంచాయితీ తేలని పరిస్థతి కనిపిస్తోంది. అనపర్తి సీటు టీడీపీకి, దెందులూరు బీజేపీకి ఇచ్చేలా ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌తో అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: సమ్మర్‌లో కడుపును చల్లగా ఉంచే స్పెషల్‌ రైస్‌లు..ఒక సారి ట్రై చేయండి

మాడుగులలో పైలా ప్రసాద్‌ స్థానంలో బండారు సత్యనారాయణమూర్తికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మడకశిరలో అనిల్‌కుమార్‌కు బదులు MS రాజుకు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తోంది. తంబళ్లపల్లె అభ్యర్థి జైచంద్రారెడ్డికి బదులు..
శంకర్ యాదవ్ లేదా సరళా రెడ్డికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏలూరు ఎంపీ సీట్ కూడా మార్చే ఛాన్స్‌ కనిపిస్తోంది. కమలాపురం, వెంకటగిరిల్లోనూ అభ్యర్థుల మార్పు చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు