Ayyanna Patrudu: వాలంటీర్లకు రూ. 20 నుంచి 25 వేలు.. మాజీ మంత్రి అయ్యన్న కీలక వ్యాఖ్యలు

టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్లను ప్రమోట్ చేస్తామన్నారు మాజీ మంత్రి అయ్యన్న. రూ. 20 నుంచి 25 వేల జీతం ఇస్తామన్నారు. ఉద్యోగం పోతుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. నర్సీపట్నం నియోజవర్గం మాకవరపాలెం మండలంలోని లచ్చన్నపాలెం గ్రామంలో ఎన్నికల శంఖారావం పూరించారు.

New Update
Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఈసీ షాక్.. చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు

TDP Ayyanna Patrudu: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజవర్గం మాకవరపాలెం మండలంలోని లచ్చన్నపాలెం గ్రామంలో ఎన్నికల శంఖారావం పూరించారు మాజీ మంత్రి, టీడీపీ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఈ సందర్భంగా వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను ప్రమోట్ చేస్తామన్నారు.

Also Read: ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్యోగస్తులకు లక్షల్లో జీతాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్లకు 5000 రూపాయలు మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు. అయ్యన్నపాత్రుడు మీటింగ్ కు వెళ్తే ప్రజలకు పథకాలు తీసేస్తామని వాలంటీర్లను వైసీపీ నాయకులు చెప్పమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది టీడీపీనేనని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: ఆ నియోజకవర్గం నుండే గుమ్మనూరు జయరాం పోటీ..!

టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్లకు రూ. 20 నుంచి 25 వేలు జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే వాలంటీర్లును ప్రమోట్ చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగం పోతుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి కొద్ది రోజుల్లో జైలుకు వెళ్లడం ఖాయమని అయ్యన్న పాత్రుడు అన్నారు. ఎన్నికలు సమయంలో మొదటి సారి ఇక్కడి నుంచే ఎన్నికల సంఖరావం పూరించడం అయ్యన్నకు ఆనవాయతి. దీనిలో భాగంగానే ఈ రోజు రామాలయంలో పూజలు చేసి ఎన్నికలు ప్రచారం చేపట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment