KTR: ఇప్పుడున్న సీఎం దొంగ.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్
ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటు కు నోటు లో దొరికిన దొంగ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయనే ఓ క్రిమినల్.. ఆయనకు ఉండేవే క్రిమినల్ ఆలోచనలు అని అన్నారు.
ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటు కు నోటు లో దొరికిన దొంగ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయనే ఓ క్రిమినల్.. ఆయనకు ఉండేవే క్రిమినల్ ఆలోచనలు అని అన్నారు.
తెలంగాణ అంటేనే అబద్ధాలు అనే పర్యాయ పదం తెచ్చిండు కేసీఆర్ అని రేవంత్ అన్నారు. అమరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ పై విచారణకు ఆదేశిస్తామన్నారు. నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపు, ఖర్చుల పై విచారణ జరపనున్నట్లు తెలిపారు.
బడ్జెట్లో రైతులకు కాంగ్రెస్ మొండి చెయ్యి ఇచ్చిందని అన్నారు హరీష్ రావు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారు.. ఇప్పుడు ఏమైంది? అని ప్రశ్నించారు. కేసిఆర్ రైతు ను రాజు చేస్తే... కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని అన్నారు
కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు తన కుటుంబం నుంచి మూడు పదవులు ఉండాలి అనుకున్నానని మల్లారెడ్డి అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ టికెట్ కోసం జగ్గారెడ్డి రేవంత్కు భజన చేస్తున్నారన్నారు
సీఎం రేవంత్ రెడ్డిపై చెప్పులు చూపిస్తూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బాల్క సుమన్ పరారీలో ఉన్నారు. ఆయనకోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కేసీఆర్ అసలు అసెంబ్లీ వస్తారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇష్యూను డైవర్ట్ చేయడానికే KRMBని కేసీఆర్ తీసుకున్నారని అన్నారు. మంత్రి రోజా పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానని కేసీఆర్ అన్నారని ఆరోపణలు చేశారు.
అసెంబ్లీలో కేసీఆర్ గది మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాబీలో BJLP కార్యాలయం పక్కన LOP రూమ్ను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు అసంతృత్తి వ్యక్తం చేశారు. స్పీకర్ను కలిసి పాత రూమ్నే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం రేవంత్రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.
సీఎం రేవంత్పై ధ్వజమెత్తారు కేటీఆర్. చిన్నాపెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు రేవంత్ మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ను బొంద పెట్టుడే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ను మల్కాజ్ గిరిలో మడత పెట్టీ కొట్టుడే అని అన్నారు.