Kavitha Bail Conditions: పాస్పోర్ట్ ఇచ్చేయాలి.. అలా అస్సలు చేయొద్దు.. కవిత బెయిల్ కండీషన్లు ఇవే! సుప్రీం కోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించింది. అయితే, 10 లక్షల రూపాయల రెండు పూచీకత్తులతో పాటు, పాస్ పోర్ట్ సమర్పించాలని కోర్టు చెప్పింది. సాక్షులను ప్రభావితం చేయడం, తారుమారు చేయడం చేయకూడదని సుప్రీం కోర్టు షరతులు విధించింది. By KVD Varma 27 Aug 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Bail to MLC Kavitha: తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్కు (Delhi Liquor Scam) సంబంధించిన ED - CBI కేసులో కవిత మార్చి 2024 నుండి జైలులో ఉన్నారు. సాక్ష్యాలను తారుమారు చేయకుండా, సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండాలని బెయిల్ ఇస్తున్న సందర్భంగా కోర్టు షరతులు విధించింది. రూ.10 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు అంటే బెయిల్ బాండ్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ - “కేసు దర్యాప్తు పూర్తయింది. కె కవిత ఐదు నెలలుగా జైలులో ఉన్నారు. అండర్ ట్రయల్ కస్టడీని శిక్షగా మార్చకూడదని ఈ కోర్టులో చాలాసార్లు చెప్పారు.” అని పేర్కొంది. Bail to Kavitha: కవిత దేశం విడిచి పారిపోయే ప్రమాదం లేదని ఆమె తరపున వాదించిన లాయర్ ముకుల్ రోహత్గీ అన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను తొలిసారిగా మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్లో ఇదే కేసులో సీబీఐ కూడా ఆమెను అరెస్టు చేసింది. అంతకుముందు జూలైలో, కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఆమె ప్రధాన నిందితురాలనీ, విచారణ ఇంకా కీలక దశలోనే ఉందని కోర్టు పేర్కొంది. ప్రస్తుతం బెయిల్ మంజూరు చేయడం కుదరదు అని చెప్పింది. అయితే, ఇదే కేసులో ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కూడా బెయిల్ మంజూరైంది. బెయిల్ కోసం కవితకు సుప్రీంకోర్టు షరతులు ఇవే.. ఒక్కోటి రూ.10 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు అంటే బెయిల్ బాండ్ చెల్లించాల్సి ఉంటుంది. సాక్ష్యాలు తారుమారు చేయకూడదు. అలాగే, సాక్షులను ప్రభావితం చేసేలా ప్రవర్తించకూడదు. కవిత తన పాస్పోర్ట్ను సమర్పించాల్సి ఉంటుంది. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. Bail to Kavitha: పీఎంఎల్ఏ కింద సెక్షన్ 45ను సుప్రీంకోర్టు ఉదహరించింది. దీని కింద మహిళ కావడంతో కవిత ప్రత్యేక ప్రయోజనాలకు అర్హులని తెలిపారు. సెక్షన్ 41 ప్రకారం విద్యావంతులైన మహిళ ప్రత్యేక గౌరవానికి అర్హులు కాకూడదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యను కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. హైకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని, ఆ తర్వాత చదువుకున్న మహిళకు బెయిల్ రాదనే అభిప్రాయం ఏర్పడిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు “మా అభిప్రాయం ఇందుకు వ్యతిరేకం. మహిళా ఎంపీ, సాధారణ మహిళ అనే తేడా ఉండకూడదు.” అని చెప్పింది. #mlc-kavitha #supreme-court-conditions #delhi-liquor-scam సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి