Crime News: ఏలూరు జిల్లాలో దారుణం.. పిల్లనిచ్చిన మామను అల్లుడు ఏం చేశాడంటే..

ఏలూరు జిల్లా జగన్నాధపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పిల్లనిచ్చిన మామ లాజర్‌ను అల్లుడు సుబ్బారావు ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేయగా లాజర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పరారీలోని నిందితుడి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

New Update
Crime News: ఏలూరు జిల్లాలో దారుణం.. పిల్లనిచ్చిన మామను అల్లుడు ఏం చేశాడంటే..

Eluru: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐ యస్ జగన్నాధపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పిల్లనిచ్చిన మామను అల్లుడు ఇనుపరాడ్డుతో చంపిన ఘటన వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ద్వారకా తిరుమల మండలం ఐయస్ జగన్నాధపురం గ్రామానికి చెందిన లాజర్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు. 20 సంవత్సరాల క్రితం తన పెద్ద కుమార్తెను జి కొత్తపల్లి గ్రామానికి చెందిన సుబ్బారావుకి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే, గత సంవత్సర కాలంగా సుబ్బారావు అతని భార్య గొడవల కారణంగా విడివిడిగా ఉంటున్నారు.

సుబ్బారావు భార్య తన తండ్రి లాజరు వద్దనే ఉంటుంది. అయితే కుటుంబ పోషణ నిమిత్తం సుబ్బారావు భార్య కువైట్ వెళ్లేందుకు సిద్ధమై నిన్న హైదరాబాద్ కు వెళ్ళింది. అయితే ఆమె కువైట్ వెళ్లేందుకు తన మామ లాజరే కారణమని అతనిపై కక్ష పెంచుకున్న సుబ్బారావు గత రాత్రి ఇనుప రాడ్డుతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ దాడిలో లాజర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం డాగ్ స్క్వాడ్లతో దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సుబ్బారావు పరారీలో ఉన్నట్లు ఏలూరు డి.ఎస్.పి శ్రీనివాసులు తెలిపారు.

Also Read: నందిగామ టీడీపీలో పోటా పోటీ.. మున్సిపల్ పీఠం కోసం ఎవరికి వారు ఏం చేస్తున్నారంటే..


Advertisment
Advertisment
తాజా కథనాలు