Roasted Chickpeas: గుప్పెడు శనగలు గుండెకు మేలు

వేయించిన శనగలు రోజూ తినడం వల్ల ​అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటిలో ఉండే పోషకాలు చక్కని ఆరోగ్యాన్నిస్తాయి.

New Update
Roasted Chickpeas: గుప్పెడు శనగలు గుండెకు మేలు

Roasted Chickpeas; ఇప్పుడంతా జంక్ ఫుడ్ ట్రెండ్. అన్నీ ఆన్లైన్ లోనే ఆర్డర్ ఇవ్వటమే. స్నాక్స్ కూడా ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చే పరిస్థితి ఎదురయింది. ఎన్ని ఆన్లైన్ ఫుడ్స్ వచ్చినా సరే..వేయించిన శనగలు తింటే ఆ కిక్కే వెరప్పా.
దేశవాళీ శనగల్లో చాలా పోషకాలు
టైమ్ పాస్ కు తినే శనగల్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.అందులోనూ వేపిన శనగలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ ఉంటాయి.శనగలతో మన బాల్యానికి అవినాభావ సంబంధం ఉంది. స్కూల్ డేస్ లో జేబులో శనగలు వేసుకుంటూ టైమ్ పాస్ గా తింటూ ఆ రోజులు గుర్తుకు తెచ్చుకుంటే ఆ మజానే వేరు. మనకి తెలియకుండానే ఆకలి తీర్చుకుంది .. కాలక్షేపాన్ని ఇస్తుంది.అయితే..శనగల్లో రకాలున్నాయి. హైబ్రిడ్ శనగ, దేశవాళీ శనగలు అనే రెండు రకాలున్నాయి.ముఖ్యంగా దేశవాళీ శనగల్లో చాలా పోషకాలున్నాయి
ఎ, సి, బి6 విటమిన్స్ పుష్కలంగా లభించడమే కాకుండా ఫోలేట్‌, నియాసిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌... వంటి విటమిన్లు, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, ఐరన్‌, కాపర్‌ లాంటి మినరల్స్‌ సైతం పుష్కలంగా లభిస్తాయి
టైమ్ పాస్ కోసం రోజూ కొద్దిగానైనా శనగలు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.
మితహారం  హితం
ముఖ్యంగా వేపిన శనగల్లో ఫైబర్‌, ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తాయి.వంద గ్రాముల శనగల్లో సుమారు 18 గ్రాముల ఫైబర్‌, 20 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుందంటే ఆశ్చర్యంగానే ఉంది కదా. ఈ ప్రోటీన్స్ ఆకలి లేకుండా చేస్తాయి. తద్వారా మితాహారం తినడానికి అలవాటు పడతారు.ఈ పోషకాలు కడుపును నిండుగా ఉంచుతుంది.ఎనర్జీ లెవెల్స్ పెంచడంలోనూ, హుషారుగా ఉండేందుకు కూడా ఇవి ఉపయోగ పడతాయి.

ALSO READ:PM MODI -NACIN :నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ

బరువు తగ్గండిలా
ఇక.. వేయించిన శనగల్లో ఉన్న ఫైబర్ వల్ల వెయిట్ లాస్ జరుగుతుంది. తద్వారా ఊబకాయం రాకుండా చేస్తుంది.కేలరీలు తక్కువగా ఉండటం తో ఫ్యాట్ రాకుండా చేస్తాయి ఈ వేపిన శనగలు.
వేయించిన శనగల్లో ఉన్న కాల్షియం ఎముకలు,దంతాల పటిష్టతకు దోహదపడుతుంది.
రోజూ వేయించిన శనగలు తీసుకుంటే.. శరీరానికి సరయిన స్తాయిలో కాల్షియం లభించడం వల్ల ఆస్టియోపోరోసిస్‌ బారిన పడకుండా చూస్తుంది.
గుప్పెడు వేయించిన శనగలు తింటే గుండె పదిలం.
రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే గుండె సంభoదిత సమస్యలు రాకుండా చేస్తుంది.వీటిలో ఉండే రాగి, ఫాస్పరస్ వల్ల గుండె ఆరోగ్యం గా ఉంటుంది.
షుగర్ లెవెల్స్ అదుపులో
మధుమేహంతో బాధపడేవారికి కూడా ఇవి ఉపయోగకారిగా ఉంటాయి.వీటిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి సుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడమే కాకుండా షుగర్ లెవెల్ బ్యాలెన్సింగ్ గా ఉంచుతుంది.

ALSO READ:ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు-ధ్వజమెత్తిన కేటీఆర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple: ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే....

ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై సమీక్షచేశారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒంటిమిట్టలో పర్యటించారు… కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సోమవారం ఆరా తీశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ బి.రాంగోపాల్ రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ లు పాల్గొన్నారు. వీరికి అర్చకులు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికినారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంటి మిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు, ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పరిశీలించారు.

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. దేవస్థానం సమీపంలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదిక చేరుకుని అనంతరం అక్కడ జరుగుతున్న  ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి.. కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలు ఇచ్చినారు.. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన సీతారాముల కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

 ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో.. ఆగమ శాస్త్ర ప్రకారం, శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఆలయంలో ప్రతి రోజూ దీప దీప నైవేద్యాలు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అందుకే.. ప్రతి ఆలయంలో  దేదీప్యమానంగా పూజలు అందుతున్నాయన్నారు మంత్రి ఆనం.. 12 కెటగిరీలకు చెందిన 121 గ్యాలరీలలోకి వచ్చే దాదాపు 80 వేల మంది భక్తులకు సంతృప్తికరంగా 47,770 ప్యాకెట్ల అన్న ప్రసాదాలు మంచి అంద  చేయడం జరిగిందన్నారు. ప్రజా భద్రత  కోసం సుమారు 150 కి పైగా సిసి కెమెరాల నిఘా, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment