Motkupalli Narasimhulu: రేవంత్ పాలన ఎలా చేయాలో నేర్చుకోవాలి: మోత్కుపల్లి నర్సింహులు TG: సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు మోత్కుపల్లి నర్సింహులు. రేవంత్ సీఎం అవుతాడని చెప్పింది తానేనని.. మొదటిగా సీఎం మమ్మల్నే రోడ్డున పడేశారని అన్నారు. రేవంత్ పాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని చెప్పారు. రేవంత్ మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. By V.J Reddy 07 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Motkupalli Narasimhulu: సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు. రేవంత్ సీఎం అవుతాడని చెప్పింది తానేనని.. మొదటిగా సీఎం మమ్మల్నే రోడ్డున పడేశారని అన్నారు. రేవంత్ పాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని... ఉంటానని స్పష్టత ఇచ్చారు. దళితుడిగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. సీఎం రేవంత్ మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 6 గంటలు సెక్రటేరియట్లో కూర్చున్న సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఇంత అవమానం ఎక్కడ జరగలేదని పేర్కొన్నారు. జగన్ అహంకారం వల్ల ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నాడని అన్నారు. ఎన్నికల హామీలను ఎందుకు ఇంకా నెరవేర్చలేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ దూరం అవుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళతాడని ధీమా వ్యక్తం చేశారు. Also Read: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ #motkupalli-narasimhulu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి