Prudhvi Raj : మంత్రి రోజా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్.. సింహంతో కాదు దీంతో పోల్చుకోండి: పృథ్వీరాజ్

సినీ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్ వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. సింహం సింగల్ గా వస్తుందని పోల్చుకోవడం తప్ప వాళ్లకి ఉన్నవన్నీ నక్క తెలివితేటలే అన్నారు. కాబట్టి నక్కతో పోల్చుకోవాలని ఎద్దేవ చేశారు.

New Update
Prudhvi Raj :  మంత్రి రోజా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్.. సింహంతో కాదు దీంతో పోల్చుకోండి: పృథ్వీరాజ్

Janasena Prudhvi Raj : వైసీపీ(YCP) తో తెగతెంపులు చేసుకుని విడాకులు(Divorce) కూడా ఇచ్చేశామన్నారు జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్(Prudhvi Raj). మంత్రి రోజా(Minister Roja) పొలిటికల్ లైఫ్ అయిపోయిందిని.. ఆమె ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్(Expiry Tablet) లాంటిదని విమర్శలు గుప్పించారు. ఒక మహిళ పట్ల దురుసుగా మాట్లాడటం తప్పే కానీ, సభ్యత మరిచిపోయి రోజా మాట్లాడుతుందని వివరించారు.

Also Read: ఇండియన్ ఆర్మీ భారీ రిక్రూట్‌మెంట్.. 25వేల జాబ్స్‌కు నోటిఫికేషన్!

రోజా మాట్లాడిన విధానం బట్టే తాము మాట్లాడాల్సి వస్తుందన్నారు. బూతులు తిట్టడమే టార్గెట్ గా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్(YS Jagan) అన్న కళ్ళల్లో ఆనందం చూడాలని బూతుల యూనివర్సిటీలో మంత్రులు ఎన్నో రకాలుగా మాట్లాడారన్నారు. సింహం సింగల్ గా వస్తుందని సింహంతో పోల్చుకోవడం తప్పు వాళ్లకి ఉన్నది నక్క తెలివితేటలు కాబట్టి నక్కతో పోల్చుకోవాలని ఎద్దేవ చేశారు. బలమైన వర్గాన్ని కొట్టేందుకే అందరం కలిసామన్నారు.

Also Read: బాల్క సుమన్ కు నోటీసులు.. కేసులకు భయపడనంటున్న మాజీ ఎమ్మెల్యే

ఈ క్రమంలోనే తిరుమల కొండపైన చాలా అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోర్న్ సెక్స్ లో హిందూపురం ఫిఫ్త్ ప్లేస్ లో ఉందన్నారు. వైసీపీ అక్రమాలను ప్రశ్నించేందుకే  జగనన్న వదిలిన బాణం ఈ రోజు కాంగ్రెస్లో వెళ్లి ఎదురు తిరిగిందని కామెంట్స్ చేశారు. షర్మిల బాణం చాలా పదునైనదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వదిలిన బాణం పృథ్వీరాజ్ అని పృద్వి ఒక మిసైల్ అని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు