Prudhvi Raj: రోజా భర్త వేరుగా ఉండటానికి కారణం ఇదే.. పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్..!

మంత్రి రోజాపై సినీనటుడు పృథ్వీరాజ్ విమర్శలు గుప్పించారు. రోజాని.. ఆమె భర్త భరించలేకే చెన్నైలో ఉంటున్నాడని కామెంట్స్ చేశారు. భీమవరం నియోజకవర్గ కూటమి జనసేన అభ్యర్థి రామాంజనేయులుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన అనంతరం పృథ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
Prudhvi Raj: రోజా భర్త వేరుగా ఉండటానికి కారణం ఇదే.. పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్..!

Prudhvi Raj: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో సినీనటుడు పృథ్వీరాజ్ ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. అనంతరం జనసేన ఎన్నికల కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంపై కౌంటర్లు వేశారు. ముద్రగడ పద్మనాభం రెడ్డి కాపుగా మారాడని పేర్కొన్నారు

Also Read: వైసీపీ ఎమ్మెల్యేకు వడదెబ్బ.. 108లో విజయవాడకు తరలింపు..!

తాను మూడు రోజులుగా పిఠాపురం లోనే ఉన్నానని అయితే, ఆయన ఎక్కడ కనబడలేదని.. బహుశా గుడిమెట్ల దగ్గర అడుక్కొని వున్నాడేమోనని చురకలు వేశారు. బటన్ రెడ్డి గురించి ముద్రగడకు ఏం తెలుసని..10 సంవత్సరాలు ఆయనతో కాపురం చేసిన తనకు తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: వెస్ట్ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపు ఆరోపణలు

ఈ క్రమంలోనే మంత్రి రోజాపై విమర్శలు గుప్పించారు. జబర్దస్త్ లో అవకాశాల కోసం తిరిగిన రోజా మంత్రిగా వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. రోజాని ఆమె భర్త భరించలేకే అతడు చెన్నైలో ఉంటున్నాడని ఎద్దేవ వేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు