Maoists Posters: జగన్నాథపురం జంక్షన్ లో కలకలం రేపుతోన్న మావోయిస్టుల పోస్టర్లు! ఖాకీలకు సీరియస్ వార్నింగ్!!

ములుగు జిల్లా జగన్నాథపురం జంక్షన్ లో మరోసారి మావోయిస్టుల లేఖలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గరువారం ఉదయం వాజేడు మండలంలోని జగన్నాథపురం జంక్షన్ లో ఈ లేఖలు ప్రత్యక్షమయ్యాయి. కాగా, గ్రామాల్లో త్వరలోనే వ్యవసాయం విప్లవం రాబోతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ లేఖల ద్వారా మావోయిస్టులు హెచ్చరించారు.

New Update
Maoists Posters: జగన్నాథపురం జంక్షన్ లో కలకలం రేపుతోన్న మావోయిస్టుల పోస్టర్లు! ఖాకీలకు సీరియస్ వార్నింగ్!!

Maoists Posters: ములుగు జిల్లా జగన్నాథపురం జంక్షన్ లో మరోసారి మావోయిస్టుల లేఖలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గరువారం ఉదయం వాజేడు మండలంలోని జగన్నాథపురం జంక్షన్ లో ఈ లేఖలు ప్రత్యక్షమయ్యాయి. కాగా, గ్రామాల్లో త్వరలోనే వ్యవసాయం విప్లవం రాబోతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ లేఖల ద్వారా మావోయిస్టులు హెచ్చరించారు.

ఇక ధరణి పోర్టల్ తో రైతులను కేసీఆర్ సర్కార్ దివాళా తీసిందని అన్నలు కరపత్రాల్లో పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రజలను అన్ని రకాలుగా పీడిస్తున్నాయని లేఖల్లో మావోయిస్టులు సీరియస్ అయ్యారు. పాత,కొత్త భూస్వాములు, కాంట్రాక్టర్లు, గ్రామ పరిపాలకవర్గం అంతా ఓ వ్యవస్థగా ఏర్పడి ప్రజలను అన్ని రకాలుగా దోచుకుతింటున్నారని అన్నలు లేఖల ద్వారా విమర్శలు గుప్పించారు. ఇక పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇస్తూ.. పోలీసు స్టేషన్లు పంచాయితీలు చేసే అడ్డాలుగా మారాయని లేఖలో మావోయిస్టులు ప్రస్తావించారు.

అయితే ధరణి పోర్టల్ పై అధికారప్రతిపక్షాలు తమతమ వాదనను వినిపిస్తున్నాయి. ధరణి పోర్టల్ తో రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ చెబుతుంటే.. అధికార పక్షం మాత్రం ధరణితో అన్నదాతలకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతోంది. ఈ నేపథ్యంలో ధరణి పై మావోయిస్టులు ఈవిధంగా కరపత్రాలు విడుదల చేయడం కలకలాన్ని రేపుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Thatikonda vs Kadiyam : కడియం టాల్ లీడర్ కాదు, ఫాల్ లీడర్...మాజీ మంత్రి రాజయ్య సంచలనవ్యాఖ్యలు

స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై కడియం చేసిన ఆరోపణలకు తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు.

New Update
 Thatikonda Rajaiah vs kadiyam srihari

Thatikonda Rajaiah vs kadiyam srihari

 Thatikonda vs Kadiyam : స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు. ఆయ‌న మీడియాతో మాట్లడుతూ.. కడియం శ్రీహరీ నీది నాలికా తాటి మట్టా..? తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీచ సంస్కృతి నీది.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. నువ్వు అన్నం తింటున్నవా..గడ్డి తింటున్నావా.. పదేళ్లు ఆ కుటుంబంలో అంతరంగికుడిగా ఉన్నావ్ కదా.. కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావ్.. ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి.. లేకపోతే నిన్ను బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరగనివ్వరు అని హెచ్చరించారు. న‌మ్మక‌ద్రోహానికి ప్రతిరూపం నువ్వు.. నీ ప్రవర్తన.. నీ ద్రోహాన్ని చూసి కాంగ్రెస్ వాళ్లు కూడా ఉమ్మేస్తున్నారు.1994 కు ముందు నీ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? అని ప్రశ్నించారు. 30 ఏళ్లలో ఎలా కుబేరుడు అయ్యావు.. నీ ఇళ్ళు, దేవునూరు భూములు, పెట్రోల్ బంకులే నీ అవినీతికి సాక్ష్యం అన్నారు.. విదేశాలలో నీ ఆస్తులే సాక్ష్యం..ఇంకొకసారి నీతి, నిజాయితీ గురించి మాట్లాడవద్దు అని మండిప‌డ్డారు.

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

ఇంకా ఆయన మాట్లాడుతూ, “చనిపోయిన పాము కొస తోకకు ప్రాణం ఉన్నట్టు కడియం రాజకీయం ఉండేది ” అంటూ ఘాటుగా స్పందించారు. కడియం శ్రీహరికి రాజకీయ జన్మ ఇవ్వడంలో ముందుగా కేసీఆర్ పాత్ర ఉందని, రెండోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ లభించిందని రాజయ్య పేర్కొన్నారు.అలాగే, స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పాత్రను ప్రస్తావిస్తూ, “వేడినీళ్లకు చన్నీళ్ల లాగా రాజేశ్వర్ రెడ్డి వ్యవహరించారు. అభివృద్ధి విషయాల్లో ఆయన పాత్ర ఘణనీయమైంది” అని అన్నారు. కేసీఆర్ మాటల్లో ఎప్పుడూ కడియం పేరు రాలేదని, అయినప్పటికీ ఆయన తన స్థాయిని మరిచి ప్రెస్ మీట్‌లో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఇక కడియం శ్రీహరి పాలన గురించి మాట్లాడుతూ, “ఇప్పుడిది ప్రజాస్వామ్యం కాదు, అక్రమ అరెస్టులతో ఒక వర్గానికి అనుకూలంగా పాలన సాగుతోంది. ప్రజల స్వేచ్ఛలు హరించబడుతున్నాయి” అని ఆరోపించారు.అంతేకాకుండా… “రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలకు జీవితాంతం గులామ్‌గిరి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది” అంటూ రాజయ్య హెచ్చరించారు. ఆయన కడియంపై ఆస్తుల విషయమై కూడా ఆరోపణలు చేశారు. “దేవనూరు పరిసర ప్రాంతాల్లో బినామీ పేర్లతో భూములు ఉన్నాయా? కుటుంబంతో కలిసి పాలేరు ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నావా?” అంటూ ప్రశ్నలు సంధించారు.మొత్తం 23 మంది రైతులకు చెందిన 43 ఎకరాల 38 గుంటల భూమిని బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని పేర్కొంటూ, “ఇది వాస్తవం కాదా?” అంటూ రాజయ్య నిలదీశారు. చివరగా, “నీవు టాల్ లీడర్ (ఎత్తైన నాయకుడు) కాదు, ఫాల్ లీడర్ (పడిపోయే నాయకుడు)” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

Also read :  Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

Advertisment
Advertisment
Advertisment