Vallabhaneni Vamsi: టార్గెట్ వల్లభనేని వంశీ.. పోలీసుల గాలింపు AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A-71గా వల్లభనేని వంశీని పోలీసులు చేర్చారు. వంశీ ప్రోద్బలంతోనే టీడీపీ ఆఫీసు దాడి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని అరెస్ట్ చేశారు. By V.J Reddy 11 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Vallabhaneni Vamsi:వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుడిగా వంశీ ఉన్నారు. A-71గా వల్లభనేని వంశీని పోలీసులు చేర్చారు. వంశీ ప్రోద్బలంతోనే టీడీపీ ఆఫీసు దాడి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 15 మందికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అరెస్ట్ అయిన వారిలో వంశీ ప్రధాన అనుచరులు మూల్పూరి ప్రభుకాంత్, నగేష్, డొక్కు వెంకన్నబాబు, నాగరాజు, డ్రైవర్ దుర్గారావు, కరీముల్లా, రెబ్బాని సహా మరో 8మంది ఉన్నారు. నూజివీడు సబ్ జైలుకు 15 మంది నిందితులను తరలించారు. ఈ కేసులో A-71గా ఉన్న వంశీని సైతం పోలీసులు విచారించనున్నారు. #vallabhaneni-vamsi సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి