AP: పిఠాపురంలో భారీ వర్షాలు.. కరెంట్ వైర్ రోడ్డుపై తెగిపడటంతో.. పిఠాపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు చెరువుల్లా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో కరెంట్ వైర్ రోడ్డుపై తెగిపడటంతో తీగ తగిలి ఆవు మృతి చెందింది. రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న కరెంటు స్తంభాల వైర్లను అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 19 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Pithapuram Rains: పిఠాపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేని వానతో పిఠాపురం రోడ్లు చెరువుల్లా మారాయి. ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో కరెంట్ వైర్ రోడ్డుపై తెగిపడటంతో కరెంటు తీగ తగిలి స్పాట్లోనే ఆవు మృతి చెందింది. రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న కరెంటు స్తంభాల వైర్లను అధికారులు వర్షాకాలం వచ్చినా మరమ్మతులు చేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవు మృతితో కరెంట్ తీగ చుట్టూ బారికేడ్లు పోలీసులు ఏర్పాటు చేశారు. Also Read: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై గంజాయి కేసు #pithapuram సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి