Perni Nani: చంద్రబాబు కోసం పురందేశ్వరి బరితెగించి ఇలా చేస్తుంది.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు కోసం బరితెగించి ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తూ పురందేశ్వరి ఉత్తరాలు రాస్తున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజకీయ వ్యవస్థలో ఇలాంటి బరి తెగింపు ఇప్పుడే చూస్తున్నామని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

New Update
Perni Nani:  చంద్రబాబు కోసం పురందేశ్వరి బరితెగించి ఇలా చేస్తుంది.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కోసం పురందేశ్వరి బరితెగించి 22 మంది ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయ వ్యవస్థలో ఇలాంటి బరి తెగింపు ఇప్పుడే చూస్తున్నామని నిప్పులు చెరిగారు.

Also Read: టీడీపీలోకి నరసాపురం ఎంపీ.. పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం..!

చంద్రబాబు వదిన తన మరిది కోసం బీజేపీని బాబు జనతా పార్టీ గా మార్చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు వదిన అయిన పురంధేశ్వరి అప్పుడు తండ్రి ఎన్టీఆర్ ముందు శిఖండిగా ఉన్నారని..ఇప్పుడు పెత్తందార్లు చంద్రబాబు కోసం పురంధేశ్వరి పని చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. సంస్కారం మరిచి పోయి పురందేశ్వరి మళ్ళీ శిఖండి అవతారం ఎత్తారని ధ్వజమెత్తారు.

Also Read: ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు.. ఈసీ కీలక నిర్ణయం!

బీజేపీ ఏపీ చీఫ్ బరితెగించి నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. ఎందుకు సీఈఓ నిలదీయడం లేదని ప్రశ్నించారు. సీఈఓ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణ ప్రధానాధికారికి పురంధేశ్వరి మార్చమని కొన్ని పేర్లు ఇచ్చారని అన్నారు. సీఈఓకి పురంధేశ్వరి బాసా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీని, ఎస్పీ లను ఎవరిని నియమించాలి అని పురంధేశ్వరి రాసారని వ్యాఖ్యానించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  

New Update
Inter Supplementary Exams

Inter Supplementary Exams

Inter Supplementary Exams:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. కాగా ఇంటర్‌ ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత సాధించింది. గతం కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఆధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  


 Also Read :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
 
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా ఫేయిలై విద్యార్థులు సబ్జెక్టులను బట్టి  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి.  

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!


ఈరోజు (శనివారం) ఉదయం సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్  ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి అత్యధికంగా పాస్‌ పర్సంటేజ్ నమోదు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రతీఏడు లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా.. బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

Advertisment
Advertisment
Advertisment