Perni Nani: చంద్రబాబు కోసం పురందేశ్వరి బరితెగించి ఇలా చేస్తుంది.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు కోసం బరితెగించి ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తూ పురందేశ్వరి ఉత్తరాలు రాస్తున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజకీయ వ్యవస్థలో ఇలాంటి బరి తెగింపు ఇప్పుడే చూస్తున్నామని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

New Update
Perni Nani:  చంద్రబాబు కోసం పురందేశ్వరి బరితెగించి ఇలా చేస్తుంది.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కోసం పురందేశ్వరి బరితెగించి 22 మంది ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయ వ్యవస్థలో ఇలాంటి బరి తెగింపు ఇప్పుడే చూస్తున్నామని నిప్పులు చెరిగారు.

Also Read: టీడీపీలోకి నరసాపురం ఎంపీ.. పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం..!

చంద్రబాబు వదిన తన మరిది కోసం బీజేపీని బాబు జనతా పార్టీ గా మార్చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు వదిన అయిన పురంధేశ్వరి అప్పుడు తండ్రి ఎన్టీఆర్ ముందు శిఖండిగా ఉన్నారని..ఇప్పుడు పెత్తందార్లు చంద్రబాబు కోసం పురంధేశ్వరి పని చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. సంస్కారం మరిచి పోయి పురందేశ్వరి మళ్ళీ శిఖండి అవతారం ఎత్తారని ధ్వజమెత్తారు.

Also Read: ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు.. ఈసీ కీలక నిర్ణయం!

బీజేపీ ఏపీ చీఫ్ బరితెగించి నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. ఎందుకు సీఈఓ నిలదీయడం లేదని ప్రశ్నించారు. సీఈఓ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణ ప్రధానాధికారికి పురంధేశ్వరి మార్చమని కొన్ని పేర్లు ఇచ్చారని అన్నారు. సీఈఓకి పురంధేశ్వరి బాసా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీని, ఎస్పీ లను ఎవరిని నియమించాలి అని పురంధేశ్వరి రాసారని వ్యాఖ్యానించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు