Perni Nani: పార్టీ కార్యకర్తలను జో కొట్టడానికే పవన్ ఇలా చేశాడు.. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా: పేర్ని నాని చంద్రబాబు, పవన్ రాజకీయ డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయారని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు టీడీపికి ఇంఛార్జిలే లేరని.. అందుకే జనసేనకు వదిలేశాడన్నారు. పార్టీలోని వ్యతిరేకత చల్లార్చెందుకే ఈ అభ్యర్థుల ప్రకటన డ్రామా అని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 26 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు రాజోలు, రాజానగరం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం పై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ రాజకీయ డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయారని ఎద్దేవ చేశారు. ఇప్పటికే వీళ్ళ డ్రామాలకు ప్రజలు నవ్వుకుంటున్నారని.. తాజాగా మరో కొత్త డ్రామా తెరపైకి తీసుకుని వచ్చారని కామెంట్స్ చేశారు. Also Read: ఏ ధర్మము పాటించని వాడే “బాబు”.. తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్..! గడచిన నాలుగున్నరేల్లుగా రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు టీడీపికి ఇంఛార్జిలే లేరని.. అందుకే ఆ రెండు నియోజకవర్గాలను చంద్రబాబు జనసేనకే వదిలేశాడని చెప్పుకొచ్చారు.తనకు కేటాయించిన సీట్లనే పవన్ కళ్యాణ్ నేడు ప్రకటించాడని అన్నారు. తనపై జనసైనికుల్లో, పార్టీ నేతల్లో వస్తున్న వ్యతిరేకత చల్లార్చెందుకే ఈ అభ్యర్థుల ప్రకటన డ్రామా ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు. Also Read: భారతి చేయాలనుకున్న పాదయాత్రను నేను చేశానా?.. దమ్మంటే నిరూపించండి.. షర్మిల ఛాలెంజ్..! పొత్తులపై తనని తిడుతున్న పార్టీ కార్యకర్తలను జో కొట్టడానికి ఇదో డ్రామా మాత్రమేనని పేర్కొన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ పౌరుషం నికార్సు అయినది అయితే కీలక స్థానాలను ప్రకటించే వాడని అన్నారు. పవన్ కి అంత పౌరుషం ఉంటే వైజాగ్, విజయవాడ, కాకినాడ తిరుపతి వంటి ప్రాంతాల్లో ఎందుకు ప్రకటించలేదు..? అని ప్రశ్నించారు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. #ap-ex-cm-chandrababu #janasena-pawan-kalyan #perni-nani సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి