కేంద్రంపై అవిశ్వాసం.. విపక్ష కూటమి 'ఇండియా' నిర్ణయం

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి..'ఇండియా' నిర్ణయించింది. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో మోడీ ప్రకటన చేయాలని పట్టుబడుతున్న ఈ కూటమి..ఈమేరకు బుధవారం నోటీసును అందజేయాలని తీర్మానించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కార్యాలయంలో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లంతా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం తమకు 24 గంటల సమయం ఇవ్వాలని కోరింది.

New Update
కేంద్రంపై అవిశ్వాసం.. విపక్ష కూటమి 'ఇండియా' నిర్ణయం

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి..'ఇండియా' నిర్ణయించింది. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో మోడీ ప్రకటన చేయాలని పట్టుబడుతున్న ఈ కూటమి..ఈమేరకు బుధవారం నోటీసును అందజేయాలని తీర్మానించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కార్యాలయంలో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లంతా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం తమకు 24 గంటల సమయం ఇవ్వాలని కోరింది.

Parliament Monsoon Session | Opposition to move no-confidence motion in Lok Sabha - The Hindu

లోక్ సభలో బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయేకు మెజారిటీ ఉన్నప్పటికీ.. మణిపూర్ విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటాన బెట్టేందుకు తమ నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నామని ఆ నేత చెప్పారు. అవిశ్వాస తీర్మాన యోచనపై మరిన్ని చర్చలు జరపాలని ఒక దశలో భావించామన్నారు. ,, ఒకవేళ పార్లమెంటులో ఈ తీర్మానం వీగిపోయిన పక్షంలో అది ప్రభుత్వానికే 'పాజిటివ్ సీన్' గా మారే ఛాన్స్ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ఏమైనప్పటికీ లోక్ సభలో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించే విషయంలో విపక్షాలు ఒకే తాటిపై ఉన్నాయని తెలుస్తోంది.

మంగళవారం ఉదయం ఖర్గే ఛాంబర్ లో సమావేశమైన ప్రతిపక్షనేతలు దీనిపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. మణిపూర్ అంశంపై విపక్షాలు ఇప్పటికే పార్లమెంటులో ఉభయసభలనూ స్తంభింపజేశాయి. ఈ సమస్యపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ .. మొదట ప్రధాని మోడీ దీనిపై ఓ ప్రకటన చేయాలన్న తమ డిమాండ్ ను ఈ పార్టీలు వదులుకోలేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన ఈ నెల 20 నుంచే మణిపూర్ అంశం ఉభయసభలనూ అట్టుడికించింది.

విపక్ష సభ్యుల రభసతో సభలు పలుమార్లు వాయిదాలు పడుతూ వచ్చాయి. రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను సస్పెండ్ చేయడాన్ని కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరాయి . పార్లమెంట్ సమావేశాల నాలుగో రోజైన మంగళవారం కూడా విపక్ష కూటమి ఎంపీల గందరగోళంతో మొదట కొద్దిసేపు వాయిదా పడ్డాయి. లోక్ సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడ్డాయి. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో ఆయన ఛాంబర్ లో సమావేశమైన తరువాత కూడా ప్రతిపక్ష నేతలు .. తమ తమ డిమాండును పునరుద్ఘాటించారు. కేంద్రంపై అవిశ్వాసం తేవాలంటే 50 మంది ఎంపీలు అవసరమవుతారు. దీని 'ఔట్ లైన్' ని రూపొందించేందుకు, ఎంపీల సంతకాలను సేకరించేందుకు సంబంధించిన బాధ్యతను లోక్ సభలో కాంగ్రెస్ నేతలైన అధిర్ రంజన్ చౌదరికి, మనీష్ తివారీకి అప్పజెప్పారు. ఇక మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని కోరుతూ విపక్ష నేతలు సోమవారం రాత్రంతా పార్లమెంటు ఆవరణలో ధర్నా చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lucknow Chandrika Devi Temple : వామ్మో..ఇదేక్కడి రౌడీయిజంరా నాయనా..ప్రసాదం కొనకపోతే కొట్టేస్తారా?

లక్నోలోని చంద్రికా దేవి ఆలయానికి వెళ్లిన కొందరు భక్తులు ప్రసాదాలు కొనలేదని వారిపై అక్కడి దుకాణాదారులు దాడికి పాల్పడ్డారు. ప్రసాదం కొనుగోలు చేయలేదని ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. బెల్టులు, చెప్పులతో దాడి చేశారు. ఫలితంగా వారు తీవ్ర గాయాల పాలయ్యారు.

New Update
Shopkeepers Attack On Devotees

Shopkeepers Attack On Devotees

 Lucknow Chandrika Devi Temple : చాలామందికి దేవుడి మీద భక్తి ఉంటుంది. వారికున్న భక్తి మేరకు దేవాలయాలను సందర్శిస్తుంటారు. ఇక దైవ సన్నిధికి వెళ్లినపుడు ఉట్టి చేతులతో రాకూడదని ప్రసాదాలు, కంకణాలు వంటివి కొనక్కు వస్తుంటారు. అయితే ఇదంతా మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. డబ్బులు ఉంటే కొంటాం లేదంటే లేదు.కొన్ని సమయల్లో పరిస్థితులను బట్టి కూడా ప్రసాదాలు కొంటె కొంటాం లేదంటే కొనం. కానీ లక్నోలోని చంద్రికా దేవి ఆలయానికి వెళ్లిన కొందరు భక్తులు ప్రసాదాలు కొనలేదని వారిపై అక్కడి దుకాణాదారులు దాడికి పాల్పడ్డారు. భక్తులు ప్రసాదం కొనుగోలు చేయలేదని.. కోపంతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. బెల్టులు, చెప్పులతో దాడి చేశారు. ఫలితంగా వారు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.  

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

ఉత్తర ప్రదేశ్ లక్నోలోని బక్షి కా తలాబ్ పరధిలో చంద్రికా దేవి ఆలయం ఉంది. ఈ గుడికి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని.. లక్నోలోని త్రివేణీ నగర్‌కు చెందిన పియూష్ శర్మ, అతడి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్న ఆయన తిరిగి బయటకు వచ్చాడు. ఈక్రమంలోనే స్థానికంగా ఉన్న దుకాణాదారులు.. తమ దుకాణాల్లో ప్రసాదం కొనుగోలు చేయమని వెంట పడ్డారు. కానీ వారు ప్రసాదం కొనేందుకు ఆసక్తి చూపలేదు.

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

పదే పదే వెంట పడటంతో.. పియూష్ శర్మ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారికి సూచించారు. ఎంత బతిమాలుతున్నా వారు ప్రసాదం కొనకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దుకాణాదారులు అతడిని తిట్టడం ప్రారంభించారు. ఈక్రమంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో ఆరుగురు దుకాణాదారులు ఏకమై.. పియూష్ శర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. చెప్పులు, బెల్టులతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. పియూష్ శర్మను కొడుతుండడంతో.. ఆయన కుటుంబంలోని మహిళలు సైతం వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ దుకాణాదారులు మాత్రం వారిని కూడా కొడుతూ రచ్చ చేశారు. ఇష్టం వచ్చినట్లుగా తోసేశారు. ఫలితంగా పియూష్ శర్మ సహా ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సదరు దుకాణాదారులపై ఫిర్యాదు చేశారు. ప్రసాదం కొనలేదని వారంతా తమను విపరీతంగా కొట్టినట్లు వివరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దుకాణాదారులపై కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు దుకాణాదారులు భక్తులపై దాడి చేస్తుండగా పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు. ప్రసాదం కొనలేదనే చిన్న కారణంతో ఇంత దారుణంగా కొట్టడం ఏమాత్రం బాగాలేదని కామెంట్టు చేస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఆలయం ప్రాంగణంలో వారు దుకాణం కూడా పెట్టుకోకుండా చూడాలని అంటున్నారు. ఇలా చేస్తేనే భవిష్యత్తుల్లో మరే భక్తుడిపై దాడి జరగదని వివరిస్తున్నారు.  

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

Advertisment
Advertisment
Advertisment