Rajya Sabha: విపక్ష నేతలు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారు: రాజ్యసభ ఛైర్మన్‌

రాజ్యసభ నుంచి విపక్ష నేతల వాకౌట్‌ చేశారు. విపక్షాల తీరుపై రాజ్యసభ ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో విపక్ష నేతలు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. విపక్ష నేతలు ప్రజాస్వామ్యాన్ని అవమానించారని రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు.

New Update
Rajya Sabha: బీజేపీకి షాక్… రాజ్యసభలో తగ్గిన ఎన్డీయే సంఖ్యాబలం

Rajya Sabha Chairman Jagdeep Dhankhar: రాజ్యసభ నుంచి విపక్ష నేతల వాకౌట్‌ చేశారు. ప్రధాని ప్రసంగానికి విపక్ష నేతలు అడుగడుగునా అడ్డుతగిలారు. విపక్షాల తీరుపై రాజ్యసభ ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో విపక్ష నేతలు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. విపక్ష నేతలు సభను కాదు.. మర్యాదను విడిచి వెళ్లారని చెప్పారు. విపక్ష నేతలు ప్రజాస్వామ్యాన్ని అవమానించారని ఫైర్ అయ్యారు. సభలో ప్రతి సభ్యుడికి అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. విపక్ష నేతలు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని అన్నారు.

సభ నుంచి పారిపోయారు..

రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్ చేయడంపై ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. సభను విపక్షాలు అవమానిస్తున్నాయని అన్నారు. నిజాలు చెబుతుంటే విపక్షాలు భరించడంలేదని చురకలు అంటించారు. ప్రజలు ఓడించినా వారిలో మార్పు రాలేదని చెప్పారు. చర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారని ఎద్దేవా చేశారు.

Also Read: దేశం మొత్తం నీట్ పరీక్ష అవసరం లేదు: హీరో విజయ్

Advertisment
Advertisment
తాజా కథనాలు