AP : ఎమ్మెల్యేను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు.. మండల సమావేశం రసాబస..! ప్రకాశం జిల్లా దొనకొండ మండల సర్వసభ్య సమావేశం రసాబసగా మారింది. సమావేశానికి వచ్చిన ZP ఛైర్మెన్ వెంకాయమ్మ, దర్శి వైసీపీ ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి లను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దోనకొండకు నీటి సమస్య తీర్చలేదని ఆందోళన చేపట్టగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. By Jyoshna Sappogula 05 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ongole Donakonda Mandal Assembly Meeting Incident : ప్రకాశం జిల్లా (Prakasam District) దర్శి నియోజకవర్గం దొనకొండ మండల (Donakonda Mandal) సర్వసభ్య సమావేశం రసాబసగా మారింది. సమావేశానికి వచ్చిన ZP ఛైర్మెన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి MLA బూచే పల్లి శివ ప్రసాద్ రెడ్డిలను టీడీపీ (TDP) శ్రేణులు అడ్డుకున్నారు. ZP ఛైర్మెన్ హోదాలో ఇప్పటివరకు దోనకొండకు నీటి సమస్య తీర్చలేదని ఆందోళన చేపట్టారు. Also Read: ప్రభుత్వాలు మారుతున్నా.. తీరని నీటి కష్టాలు.. ప్రాణాలకు తెగిస్తేనే మంచి నీళ్లు! రావడానికి వీలు లేదంటూ మండల కార్యాలయం గేటువేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరువర్గాల వారిని సముదాయించి ప్రయత్నం చేశారు. కార్యాలయం వద్ద పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు. ఎట్టకేలకు లోపలికి వెళ్ళిన ZP చైర్మన్, దర్శి MLA కొద్దిసేపటికే తిరిగి వెనుదిరిగారు. #ap-tdp #ongole #donakonda-mandal #assembly-meeting సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి