AP: ASI నిర్వాకం.. కేసు పక్కన పెట్టి మందు బాబులతో చిందులు.!

ప్రకాశం జిల్లా ఒంగోలు ASI కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందులు వేశాడు. శంకరాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. విధి నిర్వహణను విస్మరించిన ఏఎస్సై వెంకటేశ్వర్లు గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు.

New Update
AP: ASI నిర్వాకం.. కేసు పక్కన పెట్టి మందు బాబులతో చిందులు.!

Ongole: ప్రకాశం జిల్లా, ఒంగోలులో కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి ASI చిందులేశాడు. ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది.

Also Read: బెంగుళూర్‌లో మాజీ సీఎం డిఫరెంట్ లుక్‌.. తొమ్మిది రోజుల తర్వాత..

ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్సై వెంకటేశ్వర్లును అధికారులు కేటాయించారు. విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు.

Also read: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు నీతులు పలకడం హాస్యాస్పదం: పురంధేశ్వరి

ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించారు.  విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్సైను వేకెన్సీ రిజర్వ్‌(వీఆర్‌)కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలిసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు