నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం... విద్యార్థిని ఆత్మహత్యాయత్నం....!

ఏలూరు ప్రభుత్వ జీఎన్ఎమ్ నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఫస్టియర్ విద్యార్థిని ఒకరు ఆత్మాహత్యాయత్నం చేసింది. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు. ర్యాగింగ్ కు తాళలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిందిని తోటి విద్యార్థులు చెబుతున్నారు.

New Update
నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం... విద్యార్థిని ఆత్మహత్యాయత్నం....!

Nursing College Student Suicide Attempt: ఏలూరు ప్రభుత్వ జీఎన్ఎమ్ నర్సింగ్ కళాశాలలో (Eluru GNM Nusring College) ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఫస్టియర్ విద్యార్థిని ఒకరు ఆత్మాహత్యాయత్నం చేసింది. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు. ర్యాగింగ్ కు తాళలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిందిని తోటి విద్యార్థులు చెబుతున్నారు.

కానీ ర్యాగింగ్ కారణంగానే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిందని అధికారులు ధ్రువీకరించడం లేదు. మూడు రోజుల నుంచి కడుపు నొప్పి వస్తుండటంతో తాళలేక ఆమె నిద్ర మాత్రలు మింగిందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరుపుతామని అధికారులు చెబుతున్నారు. విద్యార్థిని స్పృహలోకి రాగానే విచారణ జరిపి అసలు విషయాలు తెలుసుకుంటామని అన్నారు.

ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. ర్యాగింగ్ జరిగి వుంటే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. మరోవైపు సమాచారం అందుకున్న ఏలూరు పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. విద్యార్థిని నుంచి వాంగ్మూలాన్ని సేకరిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ర్యాగింగ్ ను ప్రభుత్వాలు ఇప్పటికే నిషేధించాయి. ర్యాగింగ్ కు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు అన్ని కళాశాల్లో ర్యాగింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ తరుచూ ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి వస్తుండటం కలవర పెడుతోంది. ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యుల నిర్లక్ష్యానికి బలైన పసికందు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Alekhya Chitti Pickles Issue: చావుబతుకుల్లో అలేఖ్య చిట్టి.. చిన్న పిల్లయ్యా- ఎమోషనల్ వీడియో

అలేఖ్య చిట్టి హాస్పిటల్‌లో చేరింది. బ్రీతింగ్ ఇష్యూతో ICU వార్డులో కొట్టిమిట్టాడుతుంది. తన చెల్లికి సీరియస్‌గా ఉందని సుమీ ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కూడా కష్టంగా ఉందంటూ తెలిపింది. దయచేసి ట్రోలింగ్ ఆపండంటూ వేడుకుంది.

New Update

గత వారం రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదమే నడుస్తోంది. ఆమె తిట్టిన బూతులు, ఆమె చేసిన బాగోతమే వైరల్ అవుతోంది. మీ పచ్చళ్లు రేటు ఎక్కువగా ఉన్నాయి అన్నందుకు అలేఖ్య చిట్టి బూతులతో రెచ్చిపోయింది. 

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు.. రేటు ఎక్కువ అంటున్నావు అంటే మీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందు కెరియర్ పై ఫోకస్ పెట్టు.. అంటూ నోటికొచ్చిన బూతులతో రెచ్చిపోయింది. అది కాస్త వైరల్‌ కావడంతో మీమ్స్, ట్రోలింగ్స్ మొదలయ్యాయి. దీంతో అలేఖ్యతో పాటు తన అక్కా, చెల్లిని కూడా బయటకులాగారు. 

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

వీరి ముగ్గురిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. వారికి కౌంటర్ ఇస్తూ విమర్శలు చేస్తున్నారు. తాము చేసింది తప్పేనని.. ఇకపై అలా చేయమని.. ఎవరినైతే తిట్టామో వారికి క్షమాపణలు చెబుతున్నామంటూ ముగ్గురు అక్కా చెల్లెల్లు వీడియోలు రిలీజ్ చేశారు. అయినా వారిపై ట్రోలింగ్స్ ఆగలేదు. ఇక ఈ విమర్శలకు గురైన అలేఖ్య చిట్టి తీవ్ర మనస్థాపంతో అనారోగ్యబారిన పడింది. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

ICUలో అలేఖ్య చిట్టి

అలేఖ్య చిట్టి ప్రస్తుతం హాస్పిటల్‌‌లో ఉంది. ఆమెను ICU వార్డ్‌లో ఉంచారు. అందుకు సంబంధించిన వీడియోను అలేఖ్య అక్క సుమీ (సుమ) సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలేఖ్య చిట్టికి సీరియస్‌‌గా ఉందని.. ఆమె హాస్పిటల్లో ICU బెడ్‌పై ఉందని తెలిపింది. బ్రీతింగ్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో చేరినట్లు పేర్కొంది. తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కూడా చాలా- కష్టంగా ఉందంటూ ఎమోషనల్ వీడియోను సుమీ రిలీజ్ చేసింది. 

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

అలేఖ్య చెల్లి ఆరోగ్యం అస్సలు బాలేదని తెలిపింది. సారీ చెప్పినా ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన చెందింది. దయచేసి ట్రోలింగ్ ఆపండి అంటూ నెటిజన్లను వేడుకుంది. మా నాన్న చనిపోయి 3 నెలలు కూడా కాలేదని.. ఇంకో చావు మా ఇంట్లో జరుగుతుందని భయం వేస్తోందని సుమీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ గా మారింది. 

(alekhyaa chitti pickle | alekhya chitti pickles audio | alekhya chitti pickles controversy | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు