శ్రీవారి లడ్డూతో ‘నెయ్యి’ నెయ్యం చెడింది..!?

తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యత తగ్గుతోందా..!? క్వాలిటీ నెయ్యిస్థానంలో చవుకబారు నెయ్యి శ్రీవారి లడ్డు..లబ్ధ ప్రతిష్ట దెబ్బతీయనుందా.!? అంటే..అవుననేలాగే ఉన్నాయి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కెఎమ్ ఎఫ్)వ్యాఖ్యలు.నెయ్యి సరఫరా ధరకు సంబంధించిన ఎలాంటి సంతృప్తికరమైన కొటేషన్ ను టీటీడీ ఇంత వరకూ తమకు ఎలాంటి అధికారక సమాచారం ఇవ్వలేదని కెఎమ్ఎఫ్ తెలిపింది.ఈ మేరకు ఆదివారం మిల్క్ ఫెడరేషన్ అధ్యక్షుడు భీమ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.కెఎమ్ఎఫ్ చైర్మన్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఇక నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి ఈ-టెండర్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసేలా నిర్ణయించామన్నారు. దీనికి టీటీడీ స్పందించింది. టీటీడీ ఛైర్మన్ ధర్మారెడ్డి మాట్లాడుతూ కెఎంఎఫ్ చైర్మన్ చెప్పినట్లు ఇరవై ఏళ్ళుగా వారి‌ నెయ్యి మాత్రమే కొనలేదన్నారు.టెండర్ల ద్వారా ఎవరు తక్కువ కోడ్ చేస్తే వారి నుండి కొనుగోలు చేస్తాం అది పూర్తిగా టీటీడీ మండలి నిర్ణయాధికారమని గుర్తుచేశారు. నాణ్యత ప్రమాణాలను పూర్తిగా ల్యాబ్ లో పరీక్షించే కొనుగోలు చేస్తామని ధర్మారెడ్డి తెలిపారు.

New Update
శ్రీవారి లడ్డూతో ‘నెయ్యి’ నెయ్యం చెడింది..!?

తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యత తగ్గుతోందా..!? క్వాలిటీ నెయ్యిస్థానంలో చవుకబారు నెయ్యి శ్రీవారి లడ్డు..లబ్ధ ప్రతిష్ట దెబ్బతీయనుందా.!? అంటే..అవుననేలాగే ఉన్నాయి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కెఎమ్ ఎఫ్)వ్యాఖ్యలు.

శ్రీవారి లడ్డు కోసం గత ఏభై ఏళ్లుగా సప్లై చేస్తున్న నందిని బ్రాండ్ నెయ్యిని ఫెడరేషన్  నిలిపివేస్తున్నట్టు తెలుస్తోంది.నెయ్యి సరఫరా ధరకు సంబంధించిన ఎలాంటి సంతృప్తికరమైన కొటేషన్ ను టీటీడీ ఇంత వరకూ తమకు ఎలాంటి అధికారక సమాచారం ఇవ్వలేదని కెఎమ్ఎఫ్ తెలిపింది.

ఈ మేరకు ఆదివారం మిల్క్ ఫెడరేషన్ అధ్యక్షుడు భీమ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.దక్షిణ భారత దేశంలో తిరుమల తిరుపతి ఎంతటి ప్రసిద్ధి చెందిందో...శ్రీవారి లడ్డూ కూడా అంత ప్రసిద్ధి. ఫ్రెండ్స్, కావచ్చు ఆఫీస్ కొలీగ్స్ కావచ్చు,కాస్త చనువున్న ఆఫీస్ బాస్ కావచ్చు...తిరుపతి వెళ్లొచ్చామని చెబితే చాలు.

publive-image

ఏది మాకు లడ్డు ప్రసాదం పెట్టవా..అంటూ నిర్మొహమాటంగా అడుగుటుంటారు. మన మీద ప్రేమతో కాదండోయ్...శ్రీవారి ప్రసాదం లడ్డూ మీదున్న ఇష్టంతో.! మొహమాటం లేకుండా అడిగేసే వారికోసమైనా స్తోమతను బట్టి రెండోమూడో లడ్డూలు ఎక్కువ తీసుకుంటాం.

శ్రీవారి లడ్డూకి ఉండే కమ్మటి వాసన అందులో వేసే స్వచ్ఛమైన ఆవు నెయ్యి నుంచే వస్తుంది,కమ్మటి నెయ్యి కలవడం వల్ల లడ్డూకి రుచితితో పాటు నిల్వసామర్ధ్యం కూడా పెరుగుతుంది.లడ్డు నాణ్యతా ప్రమాణాలలో ముఖ్య పాత్రపోషించే నందిని నెయ్యిని గత యాభై ఏళ్లుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సప్లై చేస్తూవస్తోంది.

అయితే ప్రస్తుతం టీటీడీ రూటు మార్చి వేరే మిల్క్ ప్రొడక్షన్ కంపెనీని రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తోందని కెఎమ్ఎఫ్ అధ్యక్షుడు భీమనాయక్ అన్నారు. తాము సప్లేచేసే నెయ్యికి ఎక్కువ ధరను డిమాండ్ చేయడంతో టీటీడీ సంస్థను మార్చేసన్నాహాలు చేస్తోందని చెప్పుకొచ్చారు.

ఈ- ప్రొక్యూర్ మెంట్ విధానం ద్వారా తక్కువ ధరకు సప్లైచేసే సంస్థకు బాధ్యతలు అప్పగిస్తుస్తామని టీటీడీ చెబుతోందన్నారు. తమ ఫెడరేషన్ సప్లైచేసే నందిని నెయ్యికి అంతర్జాతీయ మార్కెట్ ఉందన్నారు.

టీటీడీ వారు చెప్పినట్టు ఎవరైనా శ్రీవారికి నెయ్యి సప్లై చేయవచ్చు కాకపోతే నాణ్యతలో రాజీపడడం ఖాయమని భీమనాయక్ అన్నారు.అయితే దీనికి టీటీడి ఈవో ధర్మారెడ్డి స్పందించారు.

publive-image

కెఎమ్ఎఫ్ చైర్మన్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఇక నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి ఈ-టెండర్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసేలా నిర్ణయించామన్నారు.వారు చెప్పినట్టుగా టీటీడీ సంస్థ నేరుగా నందిని నెయ్యి ఎప్పుడూ కొనుగొలు చేయలేదన్నారు.

కెఎంఎఫ్ చైర్మన్ చెప్పినట్లు ఇరవై ఏళ్ళుగా వారి‌ నెయ్యి మాత్రమే కొనలేదు..పలు టెండర్ల ద్వారా ఎవరు తక్కువ కోడ్ చేస్తే వారి నుండి కొనుగోలు చేస్తాం అది పూర్తిగా టీటీడీ మండలి నిర్ణయాధికారమని గుర్తుచేశారు. నాణ్యత ప్రమాణాలను పూర్తిగా ల్యాబ్ లో పరీక్షించే కొనుగోలు చేస్తామని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan : విద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన పరిస్థితిపై విచారణ

పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

New Update
pawan kalyan

pawan kalyan Photograph: (pawan kalyan)

Pawan Kalyan :పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు  పవన్ కళ్యాణ్  ఆదేశించారు. కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు.  పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి అనే దానిపై విచారణ చేయాలని ఆదేశించారు.  సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్ ను ఏమైనా నియంత్రించారా విషయాలను కూడా తెలుసుకోవాలన్నారు.తదితర అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు పవర్‌ కళ్యాణ్‌  ఆదేశాలు జారీ చేశారు.

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

 తన పర్యటనల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఇప్పటికే పవన్ సూచించారు.కూటమి ప్రభుత్వంలో ముఖ్యుల పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ ,హెలికాప్టర్ లో వెళ్ళినా రోడ్డుపై ట్రాఫిక్ నిలవడం, చెట్లు కొట్టడం లాంటివి చేయడం ఆపడం లేదని తెలిపారు.పార్టీ శ్రేణులు, నాయకులకు సైతం క్రేన్ దండలు కార్యక్రమాలు, ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Also read :  Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్‌ లల్లాకు సూర్య తిలకం


కాగా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్ష కి ఆలస్యం అయిందని కొంతమంది విద్యార్థులు ఆరోపించారు. కన్వాయి వల్ల - పెందుర్తి అయాన్ డిజిటల్  JE అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళాల్సి వచ్చిందని వాపోయారు. 30 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష   రాయకుండా వెనిదిరగాల్సి వచ్చింది. దీనివల్ల - పిల్లల భవిష్యత్తు అగమ్య అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు