Sindhu: రాష్ట్రం మరో బీహార్ గా మారుతుంది.. మాజీ మంత్రి కూతురు సంచలన వ్యాఖ్యలు..! సీఎం జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరో బీహార్ గా మారుతుందన్నారు డాక్టర్ సింధూ నారాయణ. వైసీపీ పాలనలో రౌడీయిజం, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని విమర్శలు గుప్పించారు. నెల్లూరు ప్రజలు తన తండ్రి, మాజీ మంత్రి నారాయణని గెలిపించుకొంటారని ధీమా వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 01 May 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Narayana Daughter Sindhu: మాజీ మంత్రి నారాయణ కూతురు డాక్టర్ సింధూ నారాయణ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి నారాయణ నెల్లూరు అభివృద్ధి కోసం పని చేశారని..ఆయన నిజంగా అభివృద్ధి చేశాడంటేనే ఓటు వేసి గెలిపించండని కోరారు. తమకు రాజకీయాల్లో డబ్బులు సంపాదించాలని లేదని.. పుట్టిన గడ్డకు మేలు చేయాలని ఉందన్నారు. Also Read: రాష్ట్రం అప్పుడే బాగుపడుతుంది.. శ్రీ భరత్ సంచలన వ్యాఖ్యలు..! జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తన తండ్రిని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారని వ్యాఖ్యనించారు. నెల్లూరు ప్రజలు నారాయణని గెలిపించుకొంటారని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలు మోసపోయారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రౌడీయిజం, అవినీతి అక్రమాలలు పెరిగి పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే .. రాష్ట్రం మరో బీహార్ గా మారుతుందన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.. #narayana-daughter-sindhu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి