Nallamilli : అనపర్తి సీటుపై కొనసాగుతున్న గందరగోళం.. హాట్టాపిక్గా నల్లమిల్లి వ్యవహారం..! అనపర్తి సీటుపై గందరగోళం కొనసాగుతున్న వేళ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం హాట్టాపిక్గా మారింది. రాజమండ్రిలో నల్లమిల్లి పురంధేశ్వరిని కలిసినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు నల్లమిల్లి తెలిపారు. అనపర్తి సీటు తనదేనని వెల్లడించారు. By Jyoshna Sappogula 07 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Nallamilli Ramakrishna Reddy : తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) అనపర్తి(Anaparthy) నియోజకవర్గంలో పొత్తుల టిక్కెట్ పై గందరగోళం నెలకొన సంగతి తెలిసిందే. మొదట టీడీపీ(TDP) అధిష్టానం నల్లమల్లి రామకృష్ణారెడ్డి(Nallamilli Ramakrishna Reddy) కి ప్రకటించిన ఆ తరువాత పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీ(BJP) నేత శివరామ కృష్ణంరాజు(Shiva Ramakrishna Raju) కి కేటాయించారు. దీంతో టీడీపీ నుండి పెద్ద ఎత్తున నిరసన సెగలు తగులుతున్నాయి. Also Read: ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల తల్లి ఏం చేసిందో చూడండి తాజాగా, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం నియోజకర్గంలో హాట్టాపిక్గా మారింది. రాజమండ్రిలో నల్లమిల్లి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిసినట్లు తెలుస్తోంది. దీంతో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. తాజా రాజకీయ పరిణామాలపై, అనపర్తి సీటుపై చర్చించినట్లు నల్లమిల్లి తెలిపారు. అనపర్తి సీటు తనదేనని వెల్లడించారు. సీటుపై సానుకూలంగా నిర్ణయం వస్తుందన్నారు. నియోజకవర్గంలో టీడీపీ ఉనికి కాపాడుతామన్నారు నల్లమిల్లి. ఈ క్రమంలోనే ఏ పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. #anaparthy #nallamilli-ramakrishna-reddy #tdp #east-godavari-district సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి