AP: ఎలాన్ మస్క్ను ఎన్నికల సంఘం భారత్కు ఆహ్వానించాలని పురందేశ్వరి అన్నారు. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు మస్క్కు అవకాశమివ్వాలని చెప్పారు. ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ చాలమందికి అవకాశం ఇచ్చిందని.. ఈసీ అవకాశాలిచ్చినా ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని ఆమె పేర్కొన్నారు.
Daggubati Purandeswari:ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న మస్క్ వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి. ఎలాన్ మస్క్ను ఎన్నికల సంఘం భారత్కు ఆహ్వానించాలని అన్నారు. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు మస్క్కు అవకాశమివ్వాలని చెప్పారు. ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ చాలమందికి అవకాశం ఇచ్చిందని.. ఈసీ అవకాశాలిచ్చినా ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని ఆమె పేర్కొన్నారు. కాగా ఇటీవల ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చని మస్క్ చేసిన ట్వీట్ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.
Aghori: చంచల్గూడ జైలుకు అఘోరీ.. ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!
చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్గూడ జైలుకు తరలించి.. ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..
ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్కు పంపించారు.
లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.