AP: వైసీపీకి మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా..! AP: మాజీ సీఎం జగన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి గుడ్ బై చెప్పింది. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపింది. By Jyoshna Sappogula 28 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి MLC Sunitha: ఏపీలో మాజీ సీఎం జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా వైసీపీకి రాజీనామా చేసి త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. Also Read: జగన్కు మరో బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ ఎంపీ! తాజాగా, వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సునీత.. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖను జగన్కు పంపినట్లు తెలుస్తోంది. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. #mlc-potula-sunitha సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి