Liquor Scam Case : ఎమ్మెల్సీ కవిత సీబీఐ ఛార్జిషీట్‌పై విచారణ వాయిదా

లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేజీలు సరిగ్గా లేవని నిందితుల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది కోర్టు.

New Update
MLC Kavitha: కవిత ఎక్కడికీ పారిపోరు.. సిసోడియా బెయిల్ అంశాలే ఆమెకు వర్తిస్తాయి: ముకుల్ రోహత్గీ

MLC Kavitha Charge Sheet Enquiry Adjourned : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam Case) లో దాఖలైన తుది ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) లో విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ ఛార్జిషీట్ స్క్రూట్నీ చేయాల్సి ఉందని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్‌లో పేపర్లకు ఒక వైపు మాత్రమే పేజ్ నంబర్ ఉందని వాదనలు వినిపించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని కోర్టుకు చెప్పారు. ఈనెల 14 వరకు పేజీనేషన్ సరిచేసి ఇస్తామని కోర్టుకు సీబీఐ తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 21 మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు. కాగా సీబీఐ నమోదు చేసిన ఛార్జిషీట్ లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను ఏ17గా చేర్చారు. ఆమెతో సహా మిగత నిందితులను వర్చువల్ గా కోర్టులో హాజరుపర్చారు అధికారులు.

Also Read : భారత్‌కు మరో పతకం..రజతాన్ని కొట్టిన బల్లెం వీరుడు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TGSRTC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీ

తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వైస్‌ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని తెలిపారు.

New Update
RTC MD VC Sajjanar

RTC MD VC Sajjanar

తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వైస్‌ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని తెలిపారు. వీటి భర్తీ తర్వాత కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్  జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

Also Read: తెలంగాణ రాజకీయాల్లో పదవుల పంచాయితీ..పేలుతున్న మాటల తూటాలు!

అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన తర్వాత ఆయన మాట్లాడారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని కూడా చెప్పారు. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని తెలిపారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ ప్రకారం మరో 18వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.     

Also Read: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

గ్రూప్​1,2,3,4 పోస్టులతోపాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో14,236 అంగన్ వాడీ, హెల్త్​ డిపార్ట్​మెంట్​లో 4 వేలకు పైగా పోస్టులకు ఏప్రిల్ చివరిలోగా నోటిఫికేషన్ రిలీజ్​ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరిన్ని శాఖల ఖాళీలపై స్పష్టత రాగానే  జాబ్​క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ విడుదలకానున్నాయి. ఇక ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్  నోటిఫికేషన్‌ను షెడ్యూల్​ చేసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ కోసం వాయిదా వేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావాల్సివుంది. 

Also Read: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం

 rtv-news | rtc | jobs

 

Advertisment
Advertisment
Advertisment