/rtv/media/media_files/2025/04/25/IXU541Jjuw8p4K2CcMum.jpg)
Baisaran Valley
Baisaran Valley: జమ్మూ కశ్మీర్లోని(Jammu and Kashmir) పహల్గాం(Pahalgam) సమీపంలో ఉన్న బైసరన్ లోయలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి(Terror Attack) దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో(All Party Meeting) ఉగ్రదాడి అంశంపై కీలక చర్చలు జరిగాయి. ఈ దాడిపై విపక్షాలు భద్రతా యంత్రాంగ వైఫల్యాన్ని ప్రధానంగా కారణంగా ఎత్తిచూపాయి.
Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'
దాడి జరిగిన ప్రదేశమైన బైసరన్కు పర్యాటకులను అనుమతించిన విషయాన్ని స్థానిక అధికారులు భద్రతా సంస్థలకు ముందుగా తెలియచేయలేదన్న విషయం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశాన్ని ప్రముఖ మీడియా సంస్థలు కూడా తమ కథనాల్లో ప్రస్తావించాయి.
అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra) ప్రారంభమయ్యే జూన్ నెల వరకు సాధారణంగా బైసరన్ వంటి ప్రాంతాల్లో పర్యాటకుల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈసారి స్థానిక పాలనా యంత్రాంగం ఎటువంటి సమాచారాన్ని భద్రతా వ్యవస్థలతో పంచుకోకుండా పర్యాటకులకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
విపక్షాల తీవ్ర విమర్శలు..
ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే కనీసం 45 నిమిషాల నడక అవసరం. అలాంటి చోట ఎమర్జెన్సీ పరిస్థితులకు స్పందించే విధంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమల్లో లేకపోవడాన్ని కూడా కేంద్ర ప్రతినిధులు అఖిలపక్ష భేటీలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
విపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దాడి జరిగిన సమయంలో భద్రతా బలగాలు ఎక్కడ ఉన్నాయనే ప్రశ్నలు గట్టిగా లేవనెత్తుతున్నాయి. అలాగే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ స్పందనపై అనేక ప్రశ్నలు సాధించారని సమాచారం.
"మహారాష్ట్ర ట్రావెల్ ఏజెన్సీలు బైసరన్ తెరిచిన విషయం తెలుసుకోగలిగితే, భద్రతా సిబ్బందికి అది తెలియకపోవడం ఎలా?" అంటూ మరో ఎంపీ సుప్రియా సూలే(Supriya Sule) అనుమానాన్ని వ్యక్తం చేశారు.
Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
పహల్గాం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బైసరన్ ప్రాంతాన్ని "మినీ స్విట్జర్లాండ్"గా పిలుస్తుంటారు. ఇక్కడి పచ్చని చెట్లు, దట్టమైన అడవులు, అందమైన పర్వత దృశ్యాలు వేసవికాలంలో వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి.
అయితే, ఏప్రిల్ 22న ఇక్కడ జరిగిన దారుణం ఎప్పటికీ మరువలేనిది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు, అమాయక పర్యాటకులను చుట్టుముట్టి సమీపం నుంచి కాల్పులకు పాల్పడి 28 మంది ప్రాణాలు హరించారు. ఈ దాడి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
ఈ నేపథ్యంలో భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తగా, అఖిలపక్ష సమావేశం లో వాటిపై తీవ్రమైన చర్చ జరిగింది. కేంద్రం ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు జరిపి, బాధ్యత వహించాల్సిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలుపుతోంది.
MLC Kavitha: నేను ముందే చెప్పా.. ఇండియా కూటమిపై కవిత ఇంట్రస్టింగ్ కామెంట్స్.. బిహార్ పరిణామాలపై స్పందించిన ఎమ్మెల్సీ
ఇండియా కూటమి మూణ్నాళ్ల ముచ్చటే అని తమకు తెలుసన్నారు ఎమ్మెల్సీ కవిత. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కూటమి ఉండబోదని ముందుగానే చెప్పామన్నారు. బిహార్ లో రాజకీయ పరిణామాలపై ఆమె స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
MLC Kavitha: బిహార్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి మూణ్నాళ్ల ముచ్చటే అని తమకు తెలుసన్నారు. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కూటమి ఉండబోదని ముందుగానే చెప్పామన్నారు. జాతీయస్థాయిలో ఆ కూటమి నిలదొక్కుకునే అవకాశం లేదన్నారు కవిత. కాగా, బిహార్లో కొన్ని రోజులుగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం నితీశ్కుమార్ రాజీనామా, తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తదితర పరిణామాలు తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బిహార్ రాజకీయ పరిణామాలపై ఆదివారం ఆమె స్పందించారు. బీఆర్ఎస్ వంటి రాజకీయ పార్టీల బాధ్యత మరింతగా పెరిగిందన్నారు.
ఇది కూడా చదవండి: ఇండియా కూటమి కథ ముగిసింది.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు
నితీశ్ కుమార్ తన రాజకీయ స్వీయ అవసరాల కోసం రాష్ట్ర భవిష్యత్ను అగమ్యగోచరంగా తయారు చేస్తున్నారని కవిత విమర్శించారు. ఇది రాష్ట్ర ప్రజలకు తీవ్రంగా నష్టం చేకూరుస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరమైన ప్రస్తుత పరిస్థితుల్లో అది క్రమంగా బలహీనపడుతోందంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు దేశంలో కుల గణన జరగాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయంటూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: BRS MLAs: చిక్కుల్లో కేటీఆర్, హరీష్ రావు.. ఏం జరగనుంది?
ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్, ఢిల్లీలో ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ప్రకటన చేశారు. కీలక నేతలు ఇండియా కూటమి నుంచి వెళ్లిపోవడంతో.. ఈ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఈ కూటమిలో కాంగ్రెస్, తమిళనాడు నుంచి డీఎంకే, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పార్టీ, ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ పార్టీలు మాత్రమే మిగిలాయి. మిగతావి చిన్న చిన్న పార్టీలు మాత్రమే ఉన్నాయి.
Baisaran Valley: బైసరన్ లోయపై అఖిలపక్ష భేటీలో కేంద్రం సంచలన వ్యాఖ్యలు!
Baisaran Valley: జమ్మూ కశ్మీర్లోని పహల్గాం సమీపంలో ఉన్న బైసరన్ లోయలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర.. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
Hyderabad MLC Elections: బీజేపీకి భారీ షాక్..!! ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు.
Hyderabad MLC Elections: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ విజయం.. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
Pahalgam Attack: ముమ్మాటికి భద్రతా లోపమే.. అమిత్ షా, మోదీ రాజీనామా చేయాలి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!
ఉగ్రదాడి ముమ్మాటికి భద్రత లోపమేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | ఆంధ్రప్రదేశ్
BIG BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్ లో మరొకరు అరెస్ట్!
ఏపీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ8గా ఉన్న చాణక్యను పోలీసులు అరెస్ట్ చేశారు. Shorts for app | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Vijayashanthi Vs Revanth: రేవంత్ రెడ్డికి షాకిచ్చిన విజయశాంతి.. సంచలన ట్వీట్!
మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు.. అంటూ ధరిత్రి దినోత్సవం సందర్భంగా విజయశాంతి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వరంగల్ | తెలంగాణ
టీడీపీ నేతకు చంద్రబాబు కన్నీటి నివాళి-PHOTOS
హత్యకు గురైన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి భౌతిక కాయానికి అమ్మనబ్రోలు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు నివాళులర్పించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
Elephant dung : పేడను స్వీట్ అని అమ్మేస్తున్నచైనా.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
Amarnath Yatra: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం
TG Crime: ఏం మనిషివిరా.. కడుపుతో ఉన్న భార్యకు కూల్డ్రింక్లో పురుగులమందు కలిపి
Seema Haider : నేను ఇండియాలోనే ఉంటా.. నన్ను పంపొద్దు.. మోదీకి సీమా రిక్వెస్ట్!
Pak Terror attack: సింధూ బంద్తో పాక్ పతనం.. ఇకపై వస్తే వరదలు లేదంటే కరువులు