AP: ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని సదుపాయాలను, పలు ఎక్స్ రే మిషన్లను ఆమె పరిశీలించారు.

New Update
AP: ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే

MLA Vemireddy Prashanthi Reddy: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని సదుపాయాలను, పలు ఎక్స్ రే మిషన్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో దాతలు ముందుకు వచ్చి స్కానింగ్ యంత్రాలను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

Also Read: ప్రజలకు మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక..!

రాబోయే రోజుల్లో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని విధాల ఆసుపత్రిని డెవలప్మెంట్ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆసుపత్రిలో అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మాచురిని కూడా నూతనంగా ఆధునికరించేందుకు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి కార్యచరణ చేపడతామని ఆమె తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు