మార్పు కోసం ఈ సారి అవకాశం ఇవ్వండీ..!!

నిరుద్యోగులకు ఒక్క కొలువు ఇవ్వలేదు కానీ, కేసీఆర్ ఇంట్లో అందరికీ కొలువులే అంటూ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే రఘునందన్‌ రావు. ప్రశ్నించకపోతే దోచుకునేవారిదే రాజ్యం అవుతుందని బీఆర్‌ఎస్‌ ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే రఘునందన్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో మంచి కోసం, మార్పు కోసం ఈ సారి బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వండంటూ ఎమ్మెల్యే రఘునందన్ అభ్యర్థించారు.

New Update
మార్పు కోసం ఈ సారి అవకాశం ఇవ్వండీ..!!

MLA Raghunandan Rao: బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు త్రీవ స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఒక్క కొలువు ఇవ్వలేదు కానీ, కేసీఆర్ ఇంట్లో అందరికీ కొలువులే అంటూ దుయ్యబట్టారు. ప్రశ్నించకపోతే దోచుకునేవారిదే రాజ్యం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. తనను గెలిపించిన రెండున్నర సంవత్సరాల్లో దుబ్బాక రూపురేఖలు మార్చానని ఆయన వెల్లడించారు. హరీష్ రావు పొద్దున లేస్తే అబద్ధాలతో తప్పుడు ప్రచారం చేయడం తప్ప ఏం చేస్తాడంటూ దుయ్యబట్టారు. దుబ్బాక లో నారీ శక్తి వందన్ మహిళ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: తెలంగాణ ఎన్నికల్లో గేమ్‌ ఛేంజర్‌గా ఓబీసీ కులగణన? రాహుల్‌ అస్త్రాన్ని కేసీఆర్‌ ఎలా ఎదుర్కొనున్నారు?

హరీష్ రావు పొద్దున లేస్తే అబద్ధాలతో తప్పుడు ప్రచారం చేయడం తప్ప ఏం చేస్తాడంటూ దూషించారు. రఘునందన్ రావు గెలిస్తే మోటర్లకు మీటర్లు పెడుతాడని ప్రజలను భయపెడుతున్నాడని..అయితే ఆయన మాటలు ఏమీ నమ్మవద్దని ప్రజలకు సూచించారు. పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే కేసీఆర్‌ సంకలో చేరడం ఖాయం అంటూ ఎద్దెవ చేశారు. ఉత్తర ప్రదేశ్ లో రాహుల్ గాంధీని ఓడించిన ఘనత కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీ దని కీర్తించారు. తెలంగాణ రాష్ట్రం లో ఒక్క ఎస్సీకి కూడా మంత్రి పదవి లేదని తెలిపారు. బిసి లకు సమన్యాయం చేసే పార్టీ కేవలం బిజెపి పార్టేనని చెప్పుకొచ్చారు. 119 సీట్ల లో 70 బిసిలకు ఇవ్వాలని డిమాండ్ చేయాలన్నారు. మంచి కోసం, మార్పు కోసం ఈ సారి బిజెపి కి ఒక్క అవకాశం ఇవ్వండంటూ ఎమ్మెల్యే రఘునందన్ అభ్యర్థించారు.

రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి దుబ్బాక లో వందపడకల ఆసుపత్రి పూర్తి చేసి చూపించానని ఎమ్మెల్యే అన్నారు. తనకు భయపడి దుబ్బాక లో బస్టాండ్ కట్టించారనన్నారు. దుబ్బాక అభివృద్ధి పై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి ఏ మాత్రం సోయి లేదని దుయ్యబట్టారు. పట్టణంలో పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించిన ఘనత రఘునందన్ రావు దంటూ వ్యాఖ్యనించారు. బీఆర్ఎస్ పెద్దలు కనీసం పార్టీ శ్రేణులను గుర్తు పట్టరని విమర్శలు గుప్పించారు. సిద్దిపేట దుబ్బాక పట్టణంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ శక్తి వందన్ మహిళ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మహిళ, శిశు సంక్షేమ, మైనార్టీ శాఖ మంత్రి స్మ్రుతి ఇరానీ హాజరైయ్యారు .

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: పెళ్లయిన 6 రోజులకే ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నవ వధువు..

జమ్మూకశ్మీర్‌లో వినయర్‌ నర్వాల్ (26) అనే నేవీ అధికారి పెళ్లయిన ఆరురోజులకే టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల చేతిలో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేని ఆ నవవధువు ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Pahalgam Attack

Pahalgam Attack

జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదుల కాల్పుల్లో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. వీళ్లలో  లెఫ్టినెంట్ వినయర్‌ నర్వాల్ (26) అనే నేవీ అధికారి పెళ్లయిన ఆరురోజులకే  ఉగ్రవాదుల చేతిలో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేని ఆ నవవధువు ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాకు చెందిన వినయ్ నర్వాల్‌.. ప్రస్తుతం కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. 

Also Read: నలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు

ఏప్రిల్ 16న ఆయనకు వివాహం జరిగింది. హనీమూన్‌ కోసం ఆయన తన సతీమణితో కశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే వినయ్ జీవితం ఉగ్రవాదులకు బలైపోయింది. భర్తను కోల్పోయిన ఆ నవవధువ ఆవేదన అందరినీ కన్నీ్ళ్లు పెట్టిస్తోంది. ఆమె రోదిస్తూ.. '' మాకు పెళ్లయి ఆరు రోజులే అయ్యింది. ఈ ఘటన జరిగినప్పడు మేము పానీపూరీ తింటున్నాం. ఒక్కసారిగా ఓ ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగాడు. వెంటనే తన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని'' ఆమె ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: పహల్గామ్‌ ఉగ్రదాడి.. ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా!

ఇదిలాఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

Also Read: పహల్గామ్ అటాక్ సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్!

 telugu | Pahalgam attack

 

Advertisment
Advertisment
Advertisment