Telangana: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ.. ప్రమాణ చేయించిన గవర్నర్..

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు పాల్గొన్నారు.

New Update
Telangana: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ.. ప్రమాణ చేయించిన గవర్నర్..

Akbaruddin Owaisi protem Speaker: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అయితే, నేడు కొత్త శాసనసభ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉన్నందుగా.. ముందుగా ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్నారు. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్‌ చే అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తరువాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కాగా, స్పీకర్ ఎంపికకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అసెంబ్లీ అధికారులు. ఇప్పటికే వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను స్పీకర్‌గా నిర్ణయించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. అప్పటి వరకు సభలో సీనియర్ నాయకుడు అయిన సభ్యుడు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే అక్బరుద్దీన్‌ ప్రొటెం స్పీకర్‌గా ఉండనున్నారు.

Also Read:

నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం

పచ్చి టమాటా తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Air india:పహల్గాం ఉగ్రదాడి...కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్‌ ఇండియా!

టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది.భారత్‌కు చెందిన విమానాలకు పాక్‌ తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక పై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది.

New Update
Air India

Air India

భారత్‌ -పాక్‌ మధ్య నెలకొన్న ద్వైపాక్షిక ఉద్రిక్తతల నేపథ్యంలో టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది.భారత్‌కు చెందిన విమానాలకు తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక పై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆ మేర ప్రయాణ సమయం పెరగనుంది. ఎక్కువ ప్రయాణం కారణంగా టికెట్‌ ధర కూడా ఆ మేర పెరిగి అవకాశాలున్నాయని విమానయాన వర్గాలు చెబుతున్నాయి.

Also Read:New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

భారత్‌ కు చెందిన విమానాలకు పాకిస్థాన్‌ తన గగనతలం నుంచి ప్రయాణాల పై ఆంక్షలు విధించింది. దీంతో ఉత్తర అమెరికా,యూకే,యూరప్‌,పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చేపోయే విమానాలు ప్రత్యామ్నాయ సుదూరపు మార్గంలో ప్రయాణిస్తాయి.ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

గగనతలం మూసివేత మా చేతిలో లేని వ్యవహారం. ఏదేమైనా ఎయిరిండియా ప్రయాణికులు సిబ్బంది భద్రత మాకు అంటూ ఎయిరిండియా తన ఎక్స్‌ పోస్ట్‌ లో పేర్కొంది. పాకిస్థాన్‌ ఎయిర్‌స్పేస్‌ మూసివేతతో తాము నడిపే కొన్ని అంతర్జాతీయ విమానాల పై ప్రభావం పడుతోందని ఇండిగోసంస్థ పేర్కొంది.

వీలైనంత తొందరగా గమ్యస్థానాలకు చేర్చడంలో తమ సిబ్బంది ప్రయత్నిస్తారని తెలిపింది.ఒకవేళ మీరు ప్రయాణించబోయే విమానం పైనా దీని ప్రభావం ఉంటే స్టేటస్‌ చెక్‌ చేసి తమ వెబ్‌సైట్‌ ద్వారా రీ బుకింగ్‌ లేదా రిఫండ్‌ ను పొందొచ్చని ప్రయాణికులకు సూచిస్తూ ఎక్స్‌ వేదికగా ట్రావెల్‌ అడ్వైజరీని జారీ చేసింది. ఎయిరిండియా,ఇండిగోతోపాటు స్పైస్‌ జెట్‌, ఎయిరిండి ఎక్స్‌ప్రెస్‌ కూడా అంతర్జాతీయ సర్వీసులను నడుపుతున్నాయి. 

ఉత్తరాది నగరాల నుంచి పశ్చిమ దేశాల పై వెళ్లే విమానాల పై గగన తలం మూసివేత ప్రభావం  పడనుంది.

Also Read:Pahalgam terror attack: ఏ క్షణమైనా భారత్ -పాక్ యుద్ధం.. వేగంగా మారుతున్న పరిణామాలు?

Also Read: All-party Meeting: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటన

 air-india | indigo | flight indigo | pak | pahalgam | attack in Pahalgam | Pahalgam attack | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment