AP: వైసీపీ వెర్రి కుక్కలు.. వీరి అవినీతికి జైల్లు కూడా సరిపోవు: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ నేతలపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వారు వెర్రి కుక్కల మాదిరి ఢిల్లీలో రకరకాలుగా పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్తో సహా ఓడించి పిచ్చి కొట్టుడు కొట్టి పంపిస్తామన్నారు. By Jyoshna Sappogula 04 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి MLA Adinarayana Reddy: వైసీపీ నేతలపై జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ ఆదినారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వెర్రి కుక్కల మాదిరి వైసీపీ వారు ఢిల్లీలో రకరకాలుగా పిచ్చి కూతలు కూస్తున్నారన్నారు. గత ప్రభుత్వం పాలకులు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేశారని.. అందుకే వాటిపై తాము శ్వేత పత్రాలు విడుదల చేశామన్నారు. గత పాలనలో జగన్, వారి ఎమ్మెల్యేలు లక్షల కోట్ల రూపాయలు తినేశారని ఆరోపించారు. అభివృద్ధికి గుండు కొట్టారన్నారు. ఈసారి రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీకి గుండు సున్నానే వస్తుందని.. జగన్ తో సహా ఓడించి పిచ్చి కొట్టుడు కొట్టి పంపిస్తామన్నారు. కేంద్రంలో ప్రధానిగా మోదీ మూడోవసారి గెలవటం ప్రజలు నమ్మకమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సున్నా ఎలా అయిందో అలాగే వైసీపీ కూడా రాబోయే ఎన్నికల్లో సున్నా అవబోతుందని జోష్యం చెప్పారు. మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి అవుతుందని..సీఎం చంద్రబాబు విజన్ తో రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. Also Read: రాహుల్ జోలికొస్తే మసైపోతారు.. బీజేపీకి CWC రఘువీరారెడ్డి వార్నింగ్ దశల వారిగా పోలవరం పూర్తి అవుతుందని.. పీఎం ఆవాస్ యోజన కింద ప్రతి ఒక్క లబ్ది దారులకి ఇళ్ళు కేటాయింపులు జరుగుతాయన్నారు. అవియేషన్ మంత్రిగా ఉన్న రామ్మోహనయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ లపై ద్రుష్టి పెట్టారన్నారు. వైజాగ్ స్టీల్, రవాణా, ఇండస్ట్రియల్ క్యారిడార్స్, ఉపాధి అంశాలు ఇలా అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుందన్నారు. గత ప్రభుత్వంలో అవినీతి చేసిన వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పెద్దిరెడ్డితో సహా అందరు అవినీతి పరుల ఆట తేలుస్తామని.. వీరి చేసిన అవినీతికి జైల్లు కూడా సరిపోవని ఎద్దేవ చేశారు. కోడి కత్తి కేసు కూడా త్వరలోనే కొలిక్కి వచ్చిద్దన్నారు. జగన్ ఒక సైతాన్ లాంటివాడని దూషించారు. రాష్ట్ర ప్రగతి జరగాలని.. గత పాలనలో రాయలసీమ ప్రాజెక్ట్ లన్నిటికీ గండి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులు చూసి వైసీపీ వారు ఏడుస్తున్నారన్నారు. కూటమి ఆధ్వర్యంలో అన్ని స్కీం లు జరుగుతాయన్నారు. కేంద్రం.. రాష్ట్రానికి ఇచ్చే 142 పథకాలను జగన్ పక్క దారి పట్టించారని.. ఆ నిధులన్నీ జగన్ మాయం చేశాడని ఆరోపించారు. అంబటి రాంబాబు, రోజా, నాని లు అందరు పోయారన్నారు. పులివెందుల లోనే జగన్ కోట్ల రూపాయలు అప్పు పెట్టి వెళ్ళిపోయాడన్నారు. అందుకే పులివెందులలో కూడా ఎవరు జగన్ ని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బీజేపీ కూటమికి లోక్ సభలో, రాజ్య సభలో స్పష్టమైన మెజారిటీ ఉందన్నారు. జగన్ ఏదో పిచ్చి మాయలో ఉన్నాడని.. కేసులు, కాసులు అన్నీ బయటకి తీసుకొస్తామని ఉద్ఘాటించారు. #mla-adinarayana-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి