Minister Ponguleti Srinivas: ఇళ్లు లేనివారికి ఇళ్లు కట్టిస్తాం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన TG: మార్పు కావాలని ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకున్నారని అన్నారు మంత్రి పొంగులేటి. ఇళ్లులేని వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పేర్కొన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 19 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Minister Ponguleti Srinivas: ఖమ్మం జిల్లా పాలేరు ప్రజల దగ్గరకే పొంగులేటి కార్యక్రమం చెప్పట్టారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర పగ్గాలను అప్పగించారని అన్నారు. తెలంగాణలో దొరల పాలన పోయి ప్రజా పాలన వచ్చిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పినట్టు గానే ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని తెలిపారు. త్వరలో ఇళ్లు లేని వారిని గుర్తించి వారందరికీ ఇళ్లు కట్టిస్తాం అని అన్నారు. త్వరలోనే అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు. #indhiramma-housing-scheme #minister-ponguleti-srinivas సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి