Smartphone Addiction : ప్రపంచంలో ఈ దేశాలలో స్మార్ట్‌ఫోన్ వ్యసనం ఎక్కువ.. భారతదేశం ఏ స్థానంలో ఉందో తెలుసా..!

మెక్‌గిల్ విశ్వవిద్యాలయం ఇటీవలే వ్యసనానికి సంబంధించి ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో స్మార్ట్‌ఫోన్ వ్యసనంతో బాధపడుతున్న ప్రపంచ దేశాల జాబితాను విడుదల చేసింది. మొదటి స్థానాల్లో చైనా ఉంది. ఇందులో భారత్ 17వ స్థానంలో ఉంది.

New Update
Smartphone Addiction : ప్రపంచంలో ఈ దేశాలలో స్మార్ట్‌ఫోన్ వ్యసనం ఎక్కువ.. భారతదేశం ఏ స్థానంలో ఉందో తెలుసా..!

McGill University Studies : ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ (Smartphone), టెక్నాలజీ (Technology) వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రపంచంలో ప్రతి పని స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగుతోంది. చాలా సమయంతో పని లేకుండా రోజంతా గంటల తరబడి స్మార్ట్ ఫోన్ల పై గడిపేస్తుంటారు. అయితే ఇటీవలే స్మార్ట్‌ఫోన్ వ్యసనానికి సంబంధించి మెక్‌గిల్ విశ్వవిద్యాలయం ర్యాంకింగ్ విడుదల చేసింది. మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఏ దేశంలో ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలు అవుతున్నారో చెప్పబడింది.

మెక్‌గిల్ విశ్వవిద్యాలయం అధ్యయనం 

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (World Of Statistics), మెక్‌గిల్ విశ్వవిద్యాలయం సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ వ్యసనంతో బాధపడుతున్న ప్రపంచంలోని దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలోని మొదటి 10 దేశాలలో చైనా, సౌదీ అరేబియా, మలేషియా, బ్రెజిల్, దక్షిణ కొరియా, ఇరాన్, కెనడా, టర్కీ, ఈజిప్ట్ మరియు నేపాల్ ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్ వ్యసనంలో చైనా అగ్రస్థానంలో ఉంది

మెక్‌గిల్ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం, స్మార్ట్‌ఫోన్ వ్యసనంలో చైనా (China) ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలో సౌదీ అరేబియా రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో మలేషియా మూడో స్థానంలో ఉంది. స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలైన దేశాల జాబితాలో బ్రెజిల్ నాల్గవ స్థానంలో ఉంది. అయితే దక్షిణ కొరియా ఐదో స్థానంలో ఉంది. స్మార్ట్‌ఫోన్ వ్యసనంలో భారతదేశం 17వ స్థానంలో ఉంది.

Also Read: Amazon Offers: స్మార్ట్ ఫోన్స్ పై అమెజాన్ భారీ ఆఫర్స్.. రూ.13వేల Poco M6 5G కేవలం రూ.8,749 మాత్రమే..! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment