🛑LIVE BREAKINGS: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్

author-image
By Prasanth Reddy
New Update
BREAKING NEWS
  • Dec 18, 2024 13:11 IST

    అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్

    ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అశ్విన్ ఈ విషయాన్ని ప్రకటించాడు.

    Ravi Chandran Ashwin

    https://rtvlive.com/national/indian-cricketer-r-ashwin-announced-his-retirement-8449275



  • Dec 18, 2024 11:28 IST

    తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థుల‌కు ఊర‌ట‌.. హైకోర్టు కీలక తీర్పు!

    పీజీ వైద్య కళాశాలల్లో ప్రవేశానికి సంబందించి హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. . 15% ఆలిండియా కోటాలో.. తెలంగాణలో MBBS, BAMS, BHMS పూర్తిచేసిన రాష్ట్రేతర విద్యార్థులు విద్యార్థులు కూడా పీజీ కోర్సుల్లో ప్రవేశానికి స్థానిక కోటా కింద అర్హులని తెలిపింది.



  • Dec 18, 2024 09:50 IST

    జమ్ముకశ్మీర్‌‌‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

    జమ్మూకశ్మీర్‌లోని కథువాలో రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో మంటలు చెలరేగడంతో కుటుంబంలోని ఆరుగురు సజీవదహనం కావడంతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.



  • Dec 18, 2024 09:19 IST

    లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడు బలి

    లోన్ యాప్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌లో చోటుచేసుకుంది. లోన్‌యాప్‌లో తీసుకున్న రూ.3 లక్షలు కట్టలేకపోవడంతో ఏజెంట్లు వేధింపులు పెట్టారు. దీంతో మానసిక ఆవేదన చెంది ఆ యువకుడు పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.



  • Dec 18, 2024 08:39 IST

    కేటీఆర్‌కు బిగ్ షాక్.. రెండు రోజుల్లో నోటీసులు?

    ఫార్ములా- ఈ కార్‌ రేసు వ్యవహారంలో ఏసీబీ మరో రెండు రోజుల్లో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే విచారణ సమయంలో న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు సమాచారం.



  • Dec 18, 2024 08:38 IST

    ఏపీలో విషాదం...బస్సు కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి

    శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మండలం అనంతసాగరంలో రెండేళ్ల బాలుడు మోక్షజ్ఞ బస్సు టైర్‌ కిందపడి మరణించాడు. బస్సులో క్లీనర్‌ లేకపోవడమే చిన్నారి ప్రమాదానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

     



  • Dec 18, 2024 07:47 IST

    బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు

    ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడునుంది. దీనివల్ల తమిళనాడు, ఏపీ, యానాంలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన కర్నాల్ నివాసి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ శనివారం (ఏప్రిల్ 26) రూ.50 లక్షల పరిహారంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించారు.

New Update
Vinay Narwal Haryana

Vinay Narwal Haryana

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన కర్నాల్ నివాసి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ శనివారం (ఏప్రిల్ 26) రూ.50 లక్షల పరిహారంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించారు. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ తల్లిదండ్రుల కోరిక మేరకు కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఉగ్రవాదుల పిరికి చర్యను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు.

వివాహం చేసుకున్న ఆరు రోజుల తర్వాత

ఏప్రిల్ 16న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో వివాహం చేసుకున్న ఆరు రోజుల తర్వాత, ఏప్రిల్ 22న (మంగళవారం) పహల్గామ్‌లో ఉగ్రవాదులు చంపిన 26 మంది పర్యాటకులలో వినయ్ నర్వాల్ కూడా ఉన్నాడు. 26 ఏళ్ల అతను తన భార్య హిమాన్షితో హనీమూన్‌కు వెళ్లినప్పుడు ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు. అతని అంత్యక్రియలు ఏప్రిల్ 23న (బుధవారం) కర్నాల్‌లో జరిగాయి. 2022లో నేవీలో చేరిన తర్వాత నర్వాల్ గత ఒకటిన్నర సంవత్సరాలుగా కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్‌లో పనిచేస్తున్నాడు వినయ్ నర్వాల్.

మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా శుక్రవారం కర్నాల్ చేరుకుని వినయ్ నర్వాల్ కు నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం ఆయన కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. పాకిస్తాన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మేము స్వాగతిస్తున్నామని చెప్పిన భూపిందర్ సింగ్ మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.  

 

 

Advertisment
Advertisment
Advertisment