Markapuram: మానసను వెంటాడిన మృత్యువు..!! అసలు ఏం జరిగిందంటే..? మార్కాపురం(Markapuram)కు చెందిన బిమిశెట్టి మానస(Manasa)ను మృత్యువు వెంటాడింది. వినాయక పండుగ అనంతరం మార్కాపురం నుండి విజయవాడకు తిరుగు ప్రయాణం అయింది మానస. అయితే మార్గమధ్యలో తను ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. అయితే, అటు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కింది మానస. ఉన్నట్టుండి ఆ బస్సును లారీ ఢీ కొట్టడంతో మానస అక్కడికక్కడే మృతి చెందింది. By Jyoshna Sappogula 20 Sep 2023 in ఒంగోలు Latest News In Telugu New Update షేర్ చేయండి Markapuram: మార్కాపురంకు చెందిన బిమిశెట్టి మానసను మృత్యువు వెంటాడింది. విజయవాడలో ఫిజియో థెరపీ చదువుతున్న మానస వినాయక చవితికి తన స్వగ్రామం మార్కాపురానికి వచ్చింది. కుటుంబ సభ్యులతో పండుగను సంతోషంగా జరుపుకుంది. పండుగ అనంతరం ఫిజియో థెరపీ క్లాసుల కోసం మార్కాపురం నుండి విజయవాడకు తిరుగు ప్రయాణం అయింది మానస. మంగళవారం రాత్రి ఆర్టీసీలో రిజర్వేషన్ చేసుకుంది. Your browser does not support the video tag. తాను ప్రయాణిస్తున్న కడప డిపో ఆర్టీసీ బస్సు విజయవాడ వెళ్తున్న సమయంలో త్రిపురాంతకం రింగ్ రోడ్డు వద్ద బస్సు డివైడర్ ను ఢీ కొట్టింది. అయితే అందులో ఉన్న మానస గుంటూరు వైపు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కి ముందు సీట్లో కూర్చుంది. ఆ ప్రేవేటు ట్రావెల్ బస్సు మెడపి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. లారీ ఢీ కొట్టడంతో ముందు సీట్లో కూర్చున్న మానస స్పాట్ లోనే మృతి చెందింది. మానస విజయవాడకు చేరుకోగానే ఫోన్ చేస్తుందిలే అనుకున్న తన తల్లిదండ్రులకు మీ కూతురు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయిందని ఫోన్ వచ్చింది. దింతో ఆ కుటుంభంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. గాయపడ్డ ప్రయాణికులను 108లో వినుకొండ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మానస మృతదేహాన్నీ పోస్ట్ మార్టం నిమిత్తం యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read: ప్రేమించలేదనే కక్ష్యతో యువతిని ఏం చేశాడంటే..? #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి