ఆ రాష్ట్ర సీఎం ఒక నార్కోటిక్ టెర్రరిస్ట్.... దిష్టిబొమ్మలు దగ్దం చేసిన మణిపూర్ ఆందోళనకారులు..!

మణిపూర్‌లో ప్రజలు మిజోరాం సీఎం జోరాంతంగాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ లో పలు చోట్ల జోరంతంగా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల విషయంలో జోరంతంగా జోక్యం చేసుకుంటున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఆయన ఓ నార్కోటిక్ టెర్రరిస్టు అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు.

New Update
ఆ రాష్ట్ర సీఎం ఒక నార్కోటిక్ టెర్రరిస్ట్.... దిష్టిబొమ్మలు దగ్దం చేసిన మణిపూర్ ఆందోళనకారులు..!

మణిపూర్‌లో ప్రజలు మిజోరాం సీఎం జోరాంతంగాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ లో పలు చోట్ల జోరంతంగా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల విషయంలో జోరంతంగా జోక్యం చేసుకుంటున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఆయన ఓ నార్కోటిక్ టెర్రరిస్టు అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు.

publive-image

రాష్ట్రంలో మెయిటీలు, కూకీల మధ్య తలెత్తిన ఘర్షణల కారణంగా చెలరేగిన అల్లర్లతో రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతోంది. గత మూడు నెలలుగా రాష్ట్రంలో ఎటు చూసినా హింసాత్మక ఘటనలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని ప్రజాసంఘాలు, నిరసనల కారులు చెబుతున్నారు.

ఇాలాంటి దారుణ పరిస్థితుల్లో మణిపూర్ వ్యవహారాల్లో మిజోరాం సీఎం జోక్యం చేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో హింసను మరింత ప్రేరేపించి ఈ సంక్షోభాన్ని తీవ్ర స్థాయికి తీసుకు వెళ్లాలని ఆయన కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత సంక్షోభానికి నార్కో టెర్రరిస్టు కారణమంటూ ఫైర్ అవుతున్నారు.

అలాంటి మిలిటెంట్ల వల్లే రాష్ట్రం ఇంకా తగులబడి పోతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు మద్దతు ఇవ్వకుండా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా హింసను ప్రోత్సహించే విధంగా ఆయన వ్యవహరిస్తున్నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయన దిష్టిబొమ్మను దగ్దం చేసినట్టు పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు