Khammam Crime: కోరిక తీర్చలేదని మాటువేసి వేటు వేశాడు TG: ఖమ్మంలో తన కోరిక తీర్చలేదని సైదమ్మ అనే వివాహితను కత్తితో దారుణంగా నరికి చంపాడు శ్రీను. ఆ తరువాత తాను కూడా కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైదమ్మ మృతి చెందగా.. శ్రీను పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. By V.J Reddy 08 Jun 2024 in క్రైం ఖమ్మం New Update షేర్ చేయండి Khammam Crime: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బైరవునిపల్లిలో వివాహిత కోళ్ల సైదమ్మ (47) దారుణ హత్య గురైంది. ఇంటి బయటే మాటువేసి బయటికి రాగానే కత్తితో పొడిచి చంపాడు అదేగ్రామానికి చెందిన సొంటి శ్రీను. విషయానికి వస్తే.. కుటుంబకలహాల నేపథ్యంలో సైదమ్మ భర్తకు దూరంగా ఉంటుంది. సూర్యాపేట జిల్లా కోదాడ లోని ఓప్రైవేట్ పాఠశాలలో వార్డెన్ గా పని చేస్తోంది. తన కోరిక తీర్చాలంటూ కొద్దికాలంగా సైదమ్మను బైరవునిపల్లి గ్రామానికి చెందిన సొంటి శ్రీను వేధించడం మొదలు పెట్టాడు. ఇటీవల సెలవుల నేపథ్యంలో బైరవునిపల్లి గ్రామానికి సైదమ్మ వచ్చింది. ఇటీవల సెలవుల నేపథ్యంలో బైరవునిపల్లి గ్రామానికి సైదమ్మ రావడంతో పక్కాప్రణాళికతో కాపుకాసి సరిగ్గా బయటికి వచ్చే సమయానికి కత్తితో సైదమ్మను శ్రీను పలుచోట్ల పొడిచాడు. తీవ్ర రక్తస్రావంకావడంతో పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. అనంతరం భయంతో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు శ్రీను. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి శ్రీనును కుటుంబసభ్యులు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు #khammam-crime సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి