World Malaria Day 2024: మానవాళిని పీడించే మలేరియా నుంచి జాగ్రత్తపడదామిలా!

New Update
World Malaria Day 2024: మానవాళిని పీడించే మలేరియా నుంచి జాగ్రత్తపడదామిలా!

దోమలద్వారా వ్యాపించే ఒక అంటు వ్యాధి మలేరియా. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం- ఇప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఏటా 6 లక్షలకు పైగా మందిని కబళించింది. ఇది తీవ్రమైన సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతుంది. ముఖ్యంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మలేరియా బారిన పడుతున్నారు. మనదేశంలో మలేరియా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టు వరల్డ్‌ మలేరియా రిపోర్టు చెబుతున్నప్పటికీ ఇంకా ఇదొక సమస్య గానే మిగిలి పోయింది.

నిజానికి తగు జాగ్రత్తలు తీసుకుంటే మలేరియాను నివారించుకోవటం అసాధ్యమేమీ కాదు. మలేరియా గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో, ప్రపంచ మలేరియా దినోత్సవం 2024 ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25 న జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, మలేరియా అనేది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వచ్చే వ్యాధి. ఇది సోకిన ఆడ అనాఫిలిస్ దోమల కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. మలేరియా జ్వరం ఎక్కువగా వేసవి, వర్షాకాలంలో వస్తుంది. అనాఫిలిస్ కాటుకు గురైన వెంటనే, ప్లాస్మోడియం వైవాక్స్ మానవ శరీరంలోకి ప్రవేశించి స్వయంగా గుణించడం ప్రారంభిస్తుంది. ఈ పరాన్నజీవి కాలేయ కణాలను ఇన్‌ఫెక్షన్‌కు గురిచేస్తుంది. ఆ కణాలు విచ్ఛిన్నం కావటం వల్ల పరాన్నజీవులు రక్తంలోకి, తర్వాత ఎర్ర రక్తకణాలకు చేరుకుంటాయి. ఇన్‌ఫెక్షన్‌ కలగజేస్తాయి. ఇలాంటి వ్యక్తులను దోమలు కుట్టటం, అవి మరొకరిని కుట్టటం.. వారిలో ఇన్‌ఫెక్షన్‌ కలగజేయటం.. ఇలా ఒక చక్రం లా కొనసాగుతూ వస్తుంటుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోక పోతే, రోగి మరణించే అవకాశం ఉంది.

మలేరియా లక్షణాలు.. మలేరియా అత్యంత సాధారణ ప్రారంభ లక్షణాలు జ్వరం, తలనొప్పి, చలి. ఈ లక్షణాలు సాధారణంగా సోకిన దోమ కుట్టిన 10-15 రోజులలోపు ప్రారంభమవుతాయి. రానురాను విపరీతమైన అలసట, మూర్ఛపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం వంటివి కనిపిస్తాయి. ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నమైనప్పుడు హిమోగ్లోబిన్‌ కిడ్నీల ద్వారా బయటకు వస్తే మూత్రం నల్లగా కనిపించొచ్చు. సమస్య తీవ్రమైతే కాలేయం, కిడ్నీలు, మెదడు వంటి అవయవాలూ దెబ్బతినొచ్చు.

మలేరియా నివారణ మార్గాలు.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం తప్పనిసరి. ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో దోమల నివారణకు దోమలపొగగానీ, మందుగానీ చల్లించాలి. నివాస ప్రదేశాల చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఎందుకంటే అనాఫిలిస్ దోమలు నీటి నిల్వల్లో గుడ్లు పెడుతుంది. దోమలకు అవకాశం ఇవ్వకుండా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించండి. దోమతెరను ఉపయోగించాలి. అధిక జ్వరం , వణుకు వస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మలేరియాకు చికిత్స కన్న నివారణే సులభమని గమనిస్తూ నివారణ మార్గాలు పాటించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ మూలిక వరం

రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిన్నప్పుడు మూత్రపిండాలు, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ తీవ్రమైన వ్యాధులను నయం చేయడంలో తెల్ల ముస్లి మూలిక బాగా పనిచేస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ముస్లి మూలిక బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

New Update

Diabetes: ఇటీవలి కాలంలో చాలా మంది బాధపడుతున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి. ఒక వ్యక్తికి డయాబెటిస్ వచ్చిన తర్వాత జీవితాంతం మందులు తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆహారం, పానీయాల వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. మూత్రపిండాలు, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ తీవ్రమైన వ్యాధులను నయం చేయడంలో తెల్ల ముస్లి మూలిక బాగా పనిచేస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ముస్లి మూలిక బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

జీర్ణ సమస్యలు ఉపశమనం:

తెల్ల ముస్లి అనేది ఆయుర్వేదంలో ఒక మూలికగా పరిగణించబడే అడవి మొక్క. దీనిని తరచుగా తెల్ల బంగారం లేదా దైవిక ఔషధం అని పిలుస్తారు. తెల్ల ముస్లిని శాస్త్రీయంగా క్లోరోఫైటమ్ బోరివిలియనం అని పిలుస్తారు. ఇది ఆయుర్వేదంలో శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఇది స్త్రీ, పురుషులలో లైంగిక శక్తిని, శారీరక బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది. దీనికి గుండె సంబంధిత వ్యాధులను నయం చేసే శక్తి కూడా ఉంది. తెల్ల ముస్లీలో ఉండే లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది డయాబెటిస్ రోగులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కడుపు నొప్పి, విరేచనాలు, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి

మహిళల్లో తల్లి పాలను పెంచడానికి సహాయపడుతుంది. ఇది పురుషులు,  స్త్రీలలో మూత్ర సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. తెల్ల ముస్లీని ఆయుర్వేదం, యునాని, హోమియోపతిలో ఉపయోగిస్తారు. దీన్ని తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని చాలా మంది వైద్య నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ కణాల పెరుగుదల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  ఈ మొక్క జాతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతోంది. వైద్యులు, నిపుణుల సలహా మేరకు మాత్రమే తెల్ల ముస్లీని తినాలి. ఈ ఔషధం కొంతమందిలో అలెర్జీలకు కారణం కావచ్చు. దాని వినియోగాన్ని ప్రారంభించే ముందు నిపుణుడిని సంప్రదించాలి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వరంగల్‌లో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment