ACB Raids : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!

భూమి రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో సబ్ రిజిస్ట్రర్ మహమ్మద్ తస్లిమా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

New Update
ACB Raids : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!

ACB Raids :  భూమి రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రర్ మహమ్మద్ తస్లిమా, డేటా ఆపరేటర్ ఆలేటి వెంకటేశ్ 19,200 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మహహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రర్ ఆఫీసుపై ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో సాయంత్రం దాడులు నిర్వహించారు.

publive-image publive-image

గూడగాణి హరీశ్ అనే వ్యక్తి తన భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో సబ్ రిజిస్ట్రార్ లంచం డిమాండ్ చేశారు. సబ్ రిజిస్ట్రర్ మహ్మద్ తస్లీమా డేటా ఆపరేటర్ మధ్యవర్తిగా రూ 19,200 లంచం తీసుకుంటుండగా వరంగల్ కు చెందిన ఏసీబీ అధికారలుు దాడి చేశారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: మందుబాబులకు హైదరాబాద్ పోలీసుల షాక్.. ఆ రోజున మద్యం షాపులు బంద్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sumanth Prabhas: ఈసారి గోదారి కుర్రాడిగా 'మేమ్ ఫేమస్' హీరో.. వైరలవుతున్న టైటిల్ పోస్టర్

'మేమ్ ఫేమస్' సుమంత్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. సుభాష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి  'గోదారి గట్టుపైన' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో సుమంత్  గోదావరి ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపించనున్నాడు.

New Update

Sumanth Prabhas: తొలి సినిమా 'మేమ్ ఫేమస్' తో సూపర్ హిట్ కొట్టాడు యంగ్ హీరో సుమంత్ ప్రభాస్.  పల్లెటూరి యూత్ కథా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సుమంత్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కెరీర్ లో మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి.  అలా తన రెండవ ప్రాజెక్ట్  రెడ్ పెప్పెట్ నిర్మాణంలో చేస్తున్నాడు. అయితే తాజాగా ఈమూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. 

 'గోదారి గట్టుపైన'

డెబ్యూ డైరెక్టర్ సుభాష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి  'గోదారి గట్టుపైన' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సుమంత్  గోదావరి ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపించనున్నాడు. నిధి ప్రదీప్ కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు  ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కమెడియన్ సుధాకర్, వైవా రాఘవ్, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది ప్రారంభించిన ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సాయిసంతోష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా.. నాగ వంశీ కృష్ణ సంగీతం అందిస్తున్నారు  ఈమూవీకి.  

cinema-news Godari Gattupaina

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..

Advertisment
Advertisment
Advertisment