JD Lakshmi Narayana: జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పార్టీకి టార్చ్ లైట్ గుర్తు కేటాయింపు

జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ స్థాపించిన జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. మహారాష్ట్రలో గ్యాస్ స్ట‌వ్ గుర్తును కేటాయించింది. కాగా లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్రలో పోటీ చేయనున్నట్లు జేడీ తెలిపారు.

New Update
JD Lakshmi Narayana: జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పార్టీకి టార్చ్ లైట్ గుర్తు కేటాయింపు

JD Lakshmi Narayana: తెలుగు రాష్ట్రాల‌లో కామ‌న్ గుర్తు బ్యాట‌రీ టార్చ్ ని పొంది, జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింద‌ని ఆ పార్టీ అధ్య‌క్షులు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అన్నారు. జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీకి ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే కాదు, అటు తెలంగాణాలోనూ కామ‌న్ గుర్తును కేటాయిస్తూ, కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉత్త‌ర్వులు జారీ చేసింద‌ని ఆ పార్టీ అధ్య‌క్షులు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జేబీఎన్ పికి ఎన్నిక‌ల గుర్తు బ్యాట‌రీ టార్చ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ఇపుడు తెలంగాణాలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు కూడా ఇదే బ్యాట‌రీ టార్చ్ గుర్తును కేటాయిస్తూ, కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. అంతే కాకుండా, అటు మ‌హారాష్ట్ర‌లో కూడా ఎన్నిక‌ల్లో పోటీకి అనుమ‌తిస్తూ, ఎన్నిక‌ల గుర్తు గ్యాస్ స్ట‌వ్ ను కేటాయించింది. తెలుగు రాష్ట్రాల‌లో ఒకే బ్యాట‌రీ టార్చ్ కామ‌న్ గుర్తుపై తాము పోటీ చేయ‌డం, గ‌ర్వంగా భావిస్తున్నామ‌ని జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడు ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు