Maldives : ఇంకోసారి ఈ తప్పు జరగకుండా చూస్తాం : మాల్దీవుల మంత్రి! మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వాళ్లు చేసిన వ్యాఖ్యలు మా ప్రభుత్వ అభిప్రాయం కాదని మేం స్పష్టం చేశాం. అలా జరిగి ఉండాల్సింది కాదు. అలాగే అలాంటి వైఖరి పునరావృతం కాకుండా మేం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. By Bhavana 10 May 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Maldives Minister : మాల్దీవులు-భారత్(Maldives-India) మధ్య కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. కొంతకాలం కిందట భారత ప్రధాని మోడీ(PM Modi) లక్షద్వీప్ పర్యటన చేసిన. ఫొటోలను సోషల్ మీడియా(Social Media) లో పంచుకున్న నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ తర్వాత నుంచి రెండుదేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి జరగకుండా చూస్తామని ఆ దేశ విదేశాంగమంత్రి మూసా జమీర్ హామీ ఇచ్చారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ మనదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వాళ్లు చేసిన వ్యాఖ్యలు మా ప్రభుత్వ అభిప్రాయం కాదని మేం స్పష్టం చేశాం. అలా జరిగి ఉండాల్సింది కాదు. అలాగే అలాంటి వైఖరి పునరావృతం కాకుండా మేం తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయంలో అపార్థాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఆ దశను దాటేశాం. భారత్-మాల్దీవుల ప్రభుత్వాలు జరిగిన విషయాన్ని అర్థం చేసుకున్నాయి’’ అని వెల్లడించారు. పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతవుతాయి స్పష్టం చేశారు.ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు తీసుకున్న భారత వ్యతిరేక నిర్ణయాలు కూడా ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచాయి. ఈ సమయంలోనే జమీర్ భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా మన విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని ఈ సమావేశంలో జైశంకర్ స్పష్టం చేశారు. Also read: ప్రారంభమైన పవిత్ర చార్ ధామ్ యాత్ర.. తెరుచుకున్న ఆలయాలు.. #tourism #minister #india #maldives సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి