🔴Live News Updates: తొలి ఇన్నింగ్స్ పూర్తి.. CSK ముందు టార్గెట్ ఇదే

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates:

Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలుచేపట్టినప్పటి నుంచి అమెరికా వలసదారులపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అక్రమంగా అమెరికాకు వచ్చిన వారిని వెంటాడి, వేటాడి, వేధించైనా అమెరికా నుంచి బయటకు పంపిస్తున్నారు. అక్రమంగా వచ్చిన వారు, టూరిస్టు వీసాలపై వచ్చి దొంగచాటున అక్కడే ఉన్న వారు, చదువుకోవడానికి వచ్చి అక్రమంగా తలదాచుకుంటున్న వారిని పట్టుకుని మరీ బలవంతంగా వారి దేశాలకు పంపిస్తున్నారు. 

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

అమెరికాలో ఎక్కువకాలం నివసించే విదేశీ జాతీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఇదివరకే హెచ్చరికలు జారీ చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ.. తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్ గవర్న్‌మెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలని, ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే.. నేరం కింద పరిగణించి జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఎవరికి వారు సొంతంగా అమెరికా విడిచి వెళ్లిపోవాలని అధికారికంగా  తెలిపింది. 

Also Read:  Tv Offers: వారెవ్వా ఆఫర్లు కుమ్మేశాయ్.. 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు కేవలం రూ.15వేల లోపే!

సొంతంగా అమెరికాను వీడటమే ఉత్తమమైన మార్గమని, ఎటువంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకుని.. సామాను సర్దుకుని బయల్దేరి విమానం ఎక్కండి అంటూ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ వెల్లడించింది. ఇలాంటి వారిలో విమాన టికెట్ సొమ్మును భరించలేని వారు ఉంటే.. వారికి టికెట్ సొమ్ములో రాయితీ ఇచ్చేందుకు సైతం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.

30 రోజులకు మించి అమెరికాలో ఉన్న వారు రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి వెళ్లగొడతామని తేల్చి చెప్పింది. దాంతో పాటు ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్క రోజు అధికంగా దేశం ఉన్నా.. రోజుకు రూ.86 వేలు  జరిమానా కట్టాల్సి ఉంటుందని వివరించింది. సొంతంగా దేశం వీడకపోతే గరిష్ఠంగా రూ.4.30 లక్షలు ఫైన్ వేయనున్నట్లు మరోసారి గుర్తు చేసింది. 

జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉందని వివరించింది. జరిమానా కట్టే వారు, జైలు శిక్ష అనుభవించిన వారు భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోతారని వెల్లడించింది.హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజా నిబంధనలు హెచ్‌1బీ, విద్యార్థి పర్మిట్లపై ఉండే వారికి వర్తించబోవు. అయితే సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రం దీనిని కచ్చితంగా అమలు చేయనున్నారు. 

Also Read: Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

Also Read: Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి

  • Apr 14, 2025 21:27 IST

    తొలి ఇన్నింగ్స్ పూర్తి.. CSK ముందు టార్గెట్ ఇదే

    చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లో 63 పరుగులు సాధించాడు.

    lsg vs csk
    lsg vs csk Photograph: (lsg vs csk)

     



  • Apr 14, 2025 20:39 IST

    వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!



  • Apr 14, 2025 20:38 IST

    LSG Vs CSK: లక్నో జట్టుకు కళ్లేం వేస్తున్న CSK బౌలర్లు.. 10 ఓవర్ల స్కోర్ ఎంతంటే?



  • Apr 14, 2025 20:38 IST

    CSK vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై..



  • Apr 14, 2025 20:22 IST

    భూ భారతి పోర్టల్‌ ప్రారంభం..

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్‌ ప్రారంభమయ్యింది. హైదరాబాద్‌లో శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ దీన్ని ప్రారంభించారు. ముందుగా ప్రయోగాత్మకంగా ఈ పోర్టల్‌ను మూడు మండలాల్లో అమలు చేయనున్నారు.

    Bhu Bharati Portal inauguration
    Bhu Bharati Portal inauguration

     



  • Apr 14, 2025 18:19 IST

    అయ్యప్ప భక్తులకు శుభవార్త.. అందరికి బంగారు లాకెట్లు!

    ట్రావెన్‌కోర్ దేవస్థానం అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది. గర్భ గుడిలో పూజించిన బంగారు లాకెట్ల పంపిణీని కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్​ వాసవన్ ప్రారంభించారు. అయితే మొదట ఈ బంగారు లాకెట్‌ను ఆన్‌లైన్‌లో ఏపీకి చెందిన వ్యక్తి బుక్ చేసుకున్నాడు.

    Sabarimala gold lockets
    Sabarimala gold lockets

     



  • Apr 14, 2025 18:18 IST

    వర్షిణి నువ్వొక ఆడదానివైతే.. అఘోరీ మొదటి భార్య సంచలన సవాల్

    అఘోరీ మొదటి భార్య శ్రీవర్షిణికి సవాల్ విసిరింది. ‘‘నేను వర్షిణి అంత గలీజ్ దాన్ని కాదు. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా నేను కూడా వచ్చి పోరాడుతానని వర్షిణి చెప్పింది. వర్షిణి నిజంగా ఆడపిల్లే అయితే అఘోరీని తీసుకొచ్చి నాకు అప్పగించాలి.’’ అని సవాల్ విసిరింది.

    Lady Aghori First Wife Radha Warning To Sri Varshini
    Lady Aghori First Wife Radha Warning To Sri Varshini Photograph: (Lady Aghori First Wife Radha Warning To Sri Varshini)

     



  • Apr 14, 2025 18:18 IST

    నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. రాజీవ్ యువ వికాసం గడువు పెంపు

    రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ గడువును పెంచింది. ఏప్రిల్ 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

    CM Revanth Key Decision on Gig Workers
    CM Revanth Key Decision on Gig Workers

     



  • Apr 14, 2025 16:49 IST

    చచ్చాడు వెధవ.. 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన కామాంధుడు-గంటల వ్యవధిలో ఎన్‌కౌంటర్

    కర్ణాటకలోని హుబ్బాలీలో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న 5ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఓ కామాంధుడు రేప్ చేశాడు. ఆపై గొంతునులిమి హతమార్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. ఆ సమయంలో నిందితుడు దాడికి దిగడంతో ఎన్‌కౌంటర్ చేశారు.

     



  • Apr 14, 2025 09:06 IST

    Ukraine: ఉక్రెయిన్ పై రష్యా మళ్లీ మరో భారీ దాడి.. 34 మంది మృతి

    రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. అయినా కూడా రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది. ఇందులో 34 మంది చనిపోగా.. 117 మందికి గాయాలయ్యాయి. 

    ukraine
    Sumy City, Ukraine

     



  • Apr 14, 2025 09:03 IST

    భక్తులకు TTD అదిరిపోయే శుభవార్త.. ఇక క్యూ లైన్లో ఉండాల్సిన అవసరమే లేదు!

    సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వసతి గదుల కోసం.. దర్శన ఎన్‌రోల్‌మెంట్‌ స్లిప్‌ తెచ్చుకోవాలి.సిబ్బంది స్కానింగ్‌ చేసిన నేరుగా గదులు కేటాయిస్తారు.ఈ విధానం వల్ల క్యూలైన్లలో నిల్చునే ఇబ్బంది తప్పుతుందని టీటీడీ అధికారులు చెప్తున్నారు. 

    ttd



  • Apr 14, 2025 06:52 IST

    DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

    ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

    ipl
    DC VS MI

     



  • Apr 14, 2025 06:52 IST

    Holiday: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఈ వారంలోనే రెండు సెలవులు!

    రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త ఒకటి ప్రభుత్వాలు ప్రకటించాయి. సోమవారం మాత్రమే కాకుండా..ఈ వారంలోనే గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా మరో సెలవు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

    Telangana and Andhra Pradesh School Holiday
    Telangana and Andhra Pradesh School Holiday Photograph: (Telangana and Andhra Pradesh School Holiday)

     



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Official బిగ్ బ్రేకింగ్: యూపీలో అఘోరీ అరెస్ట్

లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాసును మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. నగ్న పూజలు పేరుతో మహిళ నుండి రూ.10 లక్షలు వసూలు చేసిన కేేసులో శ్రీనివాస్‌ను అదుపులోకి  తీసుకున్నారు.

New Update
V BREAKING

లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాసును మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. నగ్న పూజలు పేరుతో మహిళ నుండి రూ.10 లక్షలు వసూలు చేసిన కేేసులో శ్రీనివాస్‌ను అదుపులోకి  తీసుకున్నారు. లేడీ అఘోరీతోపాటు అతన్ని పెళ్లి చేసుకున్న శ్రీవర్షణిని కూడా హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో వారిని మోకిలా పోలీసులు పట్టుకున్నారు.

Also read: మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ లేడీ అఘోరీ శివ విష్ణు బ్రహ్మ అట్టూరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 6 నెలల క్రితం ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని అఘోరీ మహిళా ప్రొడ్యూసర్‌కు మాయ మాటలు చెప్పింది.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

శుద్ర పూజలు చేయడానికి అడ్వాస్‌గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని లేడీ అఘోరీ డిమాండ్ చేసింది. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది.

( Uttar Pradesh | aghori | lady aghori arrest | arrest | Mokila | aghori sri varshini | Aghori Sri Varshini)

 

Advertisment
Advertisment
Advertisment