బ్యాడ్మింటన్ ఆడిన లాలూ.... వీడియో వైరల్....!

రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, బిహార్ మాజీ ముఖ్య మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ టెన్నీస్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను లాలూ కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. వీడియోకు బాలీవుడ్ పాత సినిమాలోని ఓ పాటను బ్యాక్ గ్రౌండ్ లో యాడ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

New Update
బ్యాడ్మింటన్ ఆడిన లాలూ.... వీడియో వైరల్....!

రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, బిహార్ మాజీ ముఖ్య మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ టెన్నీస్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను లాలూ కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. వీడియోకు బాలీవుడ్ పాత సినిమాలోని ఓ పాటను బ్యాక్ గ్రౌండ్ లో యాడ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోకు తేజస్వీయాదవ్ ఓ క్యాప్షన్ పెట్టారు. లాలూ ప్రసాద్ యాదవ్ భయపడటం నేర్చుకోలేదని క్యాప్షన్ లో పేర్కొన్నారు. ఎవరికీ ఆయన తలవంచడం నేర్చు కోలేదన్నారు. గతంలో చాలా పోరాటాలు చేశారని అన్నారు. భవిష్యత్ లో కూడా పోరాటాలు కొనసాగిస్తారన్నారు. జైల్లకు కూడా ఆయన భయపడబోరన్నారు. చివరకు ఆయన విజయం సాధిస్తారన్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్ గత ఏడు నెలలుగా బిహార్ కు దూరంగా వున్నారు. గతేడాది ఆయన కిడ్నీ సంబధ వ్యాధితో బాధపడ్డారు. దీంతో ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఆయనకు కిడ్నీ దానం చేసేందుకు ఆయన కుమార్తె రోషిణి ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు గతేడాది డిసెంబర్ 5న సింగపూర్ లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు.

సింగపూర్ లో ఇటీవల ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు. అనంతరం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ తన పెద్ద కూతురు మిసా భారతి ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. కోలుకున్న అనంతరం ఆయన బిహార్ కు చేరుకున్నారు. దాణా కుంభ కోణంలో గతంలో ఆయనపై కేసులు నమోదు కాగా జైలు శిక్ష అనుభవించారు. ప్రస్తుతం వైద్య పరమైన కారణాల రీత్యా బెయిల్ పై బయటకు వచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు