KTR: కామారెడ్డి జిల్లాకు విదేశీ పరిశ్రమలు తీసుకొస్తాం

కామారెడ్డి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేటీఆర్‌.. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన రహదారులను, సెంట్రల్ లైటింగ్‌ను, రోడ్డు డివైడర్లను ప్రారంభించారు.

New Update
KTR: కామారెడ్డి జిల్లాకు విదేశీ పరిశ్రమలు తీసుకొస్తాం

Foreign Industries to Kamareddy:  కామారెడ్డి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (IT Minister KTR) అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా నియోజకవర్గ కేంద్రంలో మంత్రి పర్యటించారు. అక్కడ 28 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆరులైన్ల రహదారులను, సెంట్రల్ లైటింగ్‌ను, రోడ్డు డివైడర్లను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంపా గోవర్దన్ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ 45 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 28 కోట్ల రూపాయలతో రోడ్డు డివైడర్లును, స్వాగత తోరణాలను, సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో కామారెడ్డి జిల్లా అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌ లాంటి పెద్ద నగరాల తర్వాత అభివృద్ధి చెందుతున్న జిల్లాగా కామారెడ్డి ఉందన్నారు. విదేశీ పరిశ్రమలు కామారెడ్డి జిల్లాకు పెట్టుబడులు పెట్టేందుకు సైతం ముందుకు వచ్చేలా తయారు చేస్తామన్నారు. అదే లక్ష్యంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ముందుకు వెళ్తున్నారన్నారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. కామారెడ్డిని అభివృద్ధి చేయాలని గంపా గోవర్దన్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరగా.. సీఎం (CM KCR) వెంటనే అభివృద్ధి కార్యక్రమాల కోసం 28 కోట్లు రూపాయలను మంజూరు చేశారన్న ఆయన తాను మరో 25 కోట్ల రూపాయలను నేడే (సోమవారం) విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.

మరోవైపు పట్టణంలో మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌ రోడ్లు, స్టేడియం కోసం, అంతర్గత రహదారుల కోసం సీఎం మరో 20 కోట్లు మంజూరు చేయబోతున్నారని వివరించారు. మంత్రి కేటీఆర్ ప్రభుత్వ విప్‌పై ప్రశంసలు కురిపించారు. సౌమ్యుడైన గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, జిల్లా కేంద్రంగా మార్చి, కలెక్టర్, ఎస్పీ కార్యలయాలు, మెడికల్ కళాశాల, సువిశాల రోడ్డు తదితర అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. ఇలాంటి నేత ఉంటే నియోజకవర్గాలు త్వరగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

రోడ్డు మార్గాన కామారెడ్డి జిల్లాకు వెళ్లిన కేటీఆర్‌ ముందుగా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో ప్రజలు, కళాకారులు, మెకానిక్‌లు, బీఆర్ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు. వారు కేటీఆర్‌కు అడుగడుగునా స్వాగతం పలికారు.

Also Read: స్పీడ్ పెంచిన టీకాంగ్రెస్.. అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Congress Politics: మీనాక్షికి బిగ్ షాక్ ఇచ్చిన సీనియర్లు.. హైకమాండ్ కు కంప్లైంట్!

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ను తొలగించాలని హైకమాండ్ కు కాంగ్రెస్ సీనియర్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. HCU అంశంపై మీనాక్షి వ్యవహరించిన తీరు పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బందిగా మరిందంటూ ఫిర్యాదు చేశారు.

New Update

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు సీనియర్ నేతలు బిగ్‌షాక్ ఇచ్చారు. ఆమెను తొలగించాలంటూ ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఆమె వ్యవహారశైలితో పార్టీకి నష్టం జరుగుతుందంటూ హైకమాండ్ కు మొరపెట్టుకున్నారు. ముఖ్యంగా HCU అంశంపై మీనాక్షి వ్యవహరించిన తీరు పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బందిగా మరిందంటూ కంప్లైంట్ చేశారు. దీంతో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ను ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తారా? లేక తప్పిస్తారా? అన్న అంశం తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. HCU భూముల విషయంలో మీనాక్షి నటరాజన్ ఏకంగా సెక్రటేరియట్లోని భట్టి విక్రమార్క ఛాంబర్ లో సమీక్ష నిర్వహించిన అంశంపై విమర్శలు వచ్చాయి. అనంతరం యూనివర్సిటీకి వెళ్లి స్టూడెంట్స్ తో భేట కావడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. 

అందుకే సీనియర్లకు కోపం?

పార్టీలో అందరూ ఒకటే అనే సిద్ధాంతంతో మీనాక్షి పని చేస్తున్నారు. ఇది సీనియర్లకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. తమ సిఫారసులను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు గాంధీభవన్ లో చర్చ సాగుతోంది. రాహుల్ గాంధీ టీమ్ లో మీనాక్షి కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారన్న ప్రచారం ఉంది.

ఇక్కడ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని.. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడం, నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయడం అన్న లక్ష్యంగా మీనాక్సి నటరాజన్ ను తెలంగాణ ఇన్ఛార్జిగా నియమించింది హైకామాండ్. అయితే.. ప్రస్తుతం సీనియర్లు ఆగ్రహంగా ఉన్న ఈ తరుణంలో ఆమెను కొనసాగిస్తారా? లేక పక్కకు పెడతారా? అన్న అంశంపై తెలంగాణ పాలిటిక్స్ లో ఉత్కంఠగా మారింది.

(telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment