Kaikaluru-Eluru-Kolleru : నీట మునిగిన ఏలూరు-కైకలూరు రహదారి!

విజయవాడ బుడమేరు వరద నీరు అంతా కొల్లేరులోకి చేరుతుండడంతో కొల్లేరు ఉద్ధృతంగా ప్రవాహిస్తుంది. దీంతో కైకలూరు-ఏలూరు రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లేరును దాటే ప్రయత్నం ఎవరూ చేయోద్దని పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు.

New Update
Kaikaluru-Eluru-Kolleru : నీట మునిగిన ఏలూరు-కైకలూరు రహదారి!

Eluru - Kaikalru Highway : నిన్నటి వరకు విజయవాడ (Vijayawada) ను వణికించిన బుడమేరు...ఇప్పుడు కొల్లేరు (Kolleru) లంక గ్రామాలను వణికిస్తుంది. బుడమేరు నుంచి వరద నీరు భారీగా చేరడంతో కొల్లేరు ఉగ్రరూపం చూపిస్తుంది. దీంతో లంక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో లంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మండవల్లి, కైకలూరు, ఇంగిలిపాకలంక, కొవ్వాడలంక, నందిగామ లంక, నుచ్చుమిల్లి, పెనుమాకలంక, ఉనికిలి, తక్కెళ్లపాడు, మణుగునూరు గ్రామాలను కొల్లేరు చుట్టుముట్టింది.

దీంతో ఏలూరు-కైకలూరు మధ్య వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మణుగునూరులో బోరుల్లో వరద నీరు చేరడంతో పైపుల నుంచి బురద నీరు వస్తున్నట్లు గ్రామాల ప్రజలు తెలియజేస్తున్నారు. కోమటిలంక సమీపంలో కొల్లేరు ఉద్ధృతంగా కైకలూరులోని కొత్తపేట కేడీసీసీ బ్యాంకు (KDCC Bank) నీట మునిగింది.

ఏలూరు-కైకలూరు ప్రధాన రహదారి పై చిన ఎడ్లగాడి సమీపంలో కొల్లేరు రెండున్నర అడుగుల ఎత్తులో కొల్లేరు వరద ప్రవహిస్తోంది. 2020లో కూడా ఇదే తరహా వరదలు (Floods) రావడంతో ఆ సమయంలో కూడా సుమారు 10 రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర రోడ్డు నీటితో మునిగిపోయింది. ఏలూరు నుంచి కైకలూరు మీదుగా వెళ్లే బస్సులు, వాహనాలను నరసాపురం, భీమవరం బస్సులను నారాయణపురం జాతీయ రహదారి మీదుగా మళ్లిస్తున్నారు. బైక్‌ ల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపేశారు.

Also Read: ఏపీకి మరోసారి వానగండం.. భారీ వర్షాలు కురిసే అవకాశాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: గోరంట్ల మాధవ్ కు ఏప్రిల్ 24 వరకు రిమాండ్

మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇతనితో పాటూ మిగతా ఐదుగురికి కూడా కోర్టు రిమాండ్ విధించింది. మాధవ్‌ తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ వాదనలు వినిపించారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Ex MP Gorantla Madhav

నిన్న అరెస్ట్ అయిన వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కు గుంటూరులోని ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఏప్రిల్ 24 వరకు మాధవ్ కు, మిగతా ఐదుగురికి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు పోలీసులు వారిని నల్లపాడు పీఎస్‌ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించి  వైద్య పరీక్షలు చేయించారు. మాధవ్‌ తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ వాదనలు వినిపించారు. రిమాండ్‌ తిరస్కరించాలని కోర్టును కోరారు. కోర్టు ఆదేశాల మేరకు మాధవ్ , మిగతా ఐదుగురిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. 

మళ్ళీ మాధవ్ దురుసు ప్రవర్తన..

కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో ఈరోజు గోరంట్ల మాధవ్ మళ్ళీ దురుసుగా ప్రవర్తించారు. మీడియా ముందుకు రావడానికి కూడా నిరాకరించారు ఎంపీగా చేసిన వ్యక్తిని మీడియా ముందు తీసుకువస్తారా అంటూ గొడవ చేశారు.

మాజీ ఎంపీ, వైసీపీ లీడర్ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కిరణ్ చేబ్రోలును పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని గుంటూరు ఎస్పీ ఆఫీస్‌కు తరలించారు. ఎస్పీ ఆఫీస్‌లోనే గోరంట్ల మాధవ్ నానా హంగామా చేశారు. కోపంతో కిరణ్‌పై చేయి చేసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసుల ముందే కిరణ్‌ను కొట్టాలని చూశాడు. గుంటూరు ఎస్పీ ఆఫీస్‌లో వైసీపీ లీడర్ గోరంట్ల మాధవ్ అనుచరులతో కిరణ్‌పై దాడికి యత్నించాడు. గోరంట్ల మాధవ్ ఎస్కార్ట్ వాహనాన్ని సీజ్ చేసి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.కిరణ్ పై మొత్తం 4 కేసులు పెట్టామని ఎస్పీ సతీష్ తెలిపారు. కిరణ్ గతంలో మాజీ మంత్రి   విడదల రజినిపై కూడా అసభ్యకర పోస్టులు పెట్టాడని ఎస్సీ చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసి ఇబ్రహింపట్నం దగ్గర అతన్ని అరెస్ట్ చేశామని జిల్లా పోలీస్ అధికారి తెలిపారు.

today-latest-news-in-telugu | mp-gorantla-madhav | 14 days remand 

Also Read: బైక్‌పై హిందూ యువకుడు, ముస్లిం యువతి.. నలుగురు యువకులు ఏం చేశారంటే ?

Advertisment
Advertisment
Advertisment